మహిళలను చంపడం అనంతరం కామవాంఛ తీర్చుకోవడం...! బెంగాల్లో మరో సైకో కిల్లర్
హజీపూర్ సైకో కిల్లర్ శ్రీనును పోలిన మరో సైకో సర్కార్ పశ్చిమ బెంగాల్లో తేలాడు. మిట్ట మధ్యాహ్నం పలు కారాణాలతో ఒంటరీగా ఉన్న మహిళల ఇంట్లోకి చోరబడడం అనంతరం వారిపై ఒక్కసారిగా దాడి చేయడం , అనంతరం వారిని రక్తపు మడుగులో ఉన్న మహిళలపైనే అత్యాచారం చేస్తుండడం వాడి పని... ..ఇలా అయిదు హత్యకేసుల్లో అనుమానితుడిగా ఓ నిందితున్ని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వీడీ భారి నుండి మరో నలుగురు మహిళలు కూడ తప్పించుకున్నారు.
మహిళలను చంపి కామవాంఛ
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర బర్థమాన్ జిల్లాలోని కమ్రుజమన్ సర్కార్ ఓ మహిళను చంపి రక్తపు మడుగులో శవం ఉండగానే కామావాంఛ తీర్చుకున్న ఓ సైకోను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇలాంటీ సంఘటనలు పశ్చిమ బెంగాల్ మరో అయిదు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళలను చంపడం అనంతరం వారిపై అఘాయిత్యం చేయడం లాంటీవే గత సంఘటనల్లో జరిగాయని పోలీసులు చెబుతున్నారు. దీంతో సర్కార్ను 12 రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్న నేపథ్యంలో పలు విషయాలు వెల్లడించారు
రెడ్ కలర్ బైక్ విత్ రెడ్ కలర్ హెల్మంట్ వాడి స్ట్రైల్
42 ఏళ్ల సర్కార్ స్ర్ర్కాప్ డీలర్గా వ్యాపారం చేస్తుంటాడు. ఈనేపథ్యంలోనే మంచి లుక్లో ఉంటాడు.ఎప్పుడు రెడ్ కలర్ బైక్ మీద, రెడ్ కలర్ హెల్మెంట్ ధరించి తిరుగుతాడు. మిట్టమధ్యహ్నాం ప్రీ ఎలక్ట్ర్రిసిటీ మీటర్ల చెకింగ్ పేరుతో ఇళ్లలోకి చోరబడతాడు. అనంతరం ఒంటరిగా ఉన్న మహిళలను చూసి వారిపై ఒక్కసారిగా దాడి చేస్తాడు. దీంతో ఇలా మే 21న ఈస్ట్ భార్థన్ జిల్లాలోని గోరా గ్రామానికి చెందిన పతుల్ మజ్హీ అనే మహిళ ఇలానే చంపి వేశాడు.
సీసీ కెమారాల ఫుటేజీతో పట్టుకున్న పోలీసులు
దీంతో అలర్ట్ అయిన పోలీసులు విచరాణ చేపట్టారు. సీసీ కెమారాల్లో నిందితుడి కోసం వెతికారు. అయితే పోలీసులు విచారణలో రెడ్ కలర్ బైక్ ,తోపాటు హెల్మెంట్ పెట్టుకుని ఆ ప్రాంతంలో సంచరించే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఇదే అంశాన్ని పలు ఇతర పోలీసు స్టేషన్లకు కూడ సమాచారం ఇచ్చారు. సీసీ టీవీ ఫుటేజీలను జిల్లాలోని ఇతర పోలీసు స్టేషన్లకు కూడ పంపించారు. దీంతో గత అదివారం పోలీసులు వాహానాలు చెకింగ్ చేస్తున్న సమయంలో అనుమానంతో పట్టుకున్నారు. దీంతో అసలు విషయం బయటపడింది.
మధ్యవయస్సు మహిళలే టార్గెట్...
కాగా నిందితుడు మధ్యవయస్సు ఉన్న మహిళనే టార్గెట్ చేశాడు. అయితే ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇలా చేస్తుండ వచ్చని పోలీసులు తెలిపారు. మధ్యవయస్సు ఉన్న మహిళలనే ఎందుకు టార్గెట్ చేశాడో విచారణలో రాబడతామని తెలిపారు . కాగా
కాగా ఇదే రీతీలో జనవరి 27 ఒకరిరిని తిరిగి ఏప్రిల్ నాలుగున మరో ఇద్దరి గంటల వ్యవధిలోనే ఇలా మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఇలా నాలుగురు మహిళలు ఇదే రకంగా హత్యకు గురైన సంఘటనలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.కాగా , మరోవైపు వీడీ భారినుండి నలుగురు ఇతర మహిళలు కూడ తప్పించుకున్నారని జిల్లా పోలీస్ సూపరిండెంట్ భాస్కర్ ముఖోపాధ్యాయ తెలిపారు.
మహిళలను చంపేందుకు సైకిల్ చైన్ ,ఐరన్ రాడ్...
ఎస్పి చెప్పిన కథనం ప్రకారం సర్కార్ చూడడానికి పోట్టిగా ఉంటాడని ఈనేపథ్యంలోనే తనతోపాటు సైకిల్ చైన్ మరియు ఐరన్ రాడ్ను వెంటతీసుకెళతాడు, ముందుగా సైకిల్ చైన్తో చంపిన తర్వాత రాడ్తో కొడతాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఇంట్లోని దొంగలు వచ్చి ఎత్తుకెళ్లినట్టుగా కొన్ని విలువైన వస్తువులు ఎత్తుకెళతాడని పోలీసులు తెలిపారు. అయితే సర్కార్కు మహిళలను చంపండం తప్ప వస్తువులను ఎత్తుకెళ్లడం వాడి ప్రధాన ఉద్దేశ్యం కాదని తెలిపారు.