
మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో కూలిపోయిన ప్రభుత్వాలు ఎన్నో!!
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ 2014లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి తాజాగా మహారాష్ట్రలో ఏర్పడిన సంక్షోభవం వరకు ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు, కుప్పకూలాయి. చిత్రం ఏమిటంటే అవన్నీ మెజారిటీ సీట్లు సాధించిన ప్రభుత్వాలే అవవడం గమనార్హం. ఫిరాయిచిన ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజల మద్దతుకన్నా ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.

అన్నింటికన్నా దారుణం మధ్యప్రదేశ్?
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 2018 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ కమల్ నాథ్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 121 మంది సభ్యుల మద్దతు ఆయనకుంది. తర్వాత జ్యోతిరాదిత్య సింథియాతోపాటు 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 2020 మార్చిలో బీజేపీ తరఫున శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ సీట్లు రాకపోయినప్పటికీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమైనప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం లెక్కచేయలేదు.

కర్ణాటక, మణిపూర్ రాష్ట్రాల్లో..
కర్ణాటకలో
2018లో
జరిగిన
ఎన్నికల్లో
ఏ
పార్టీకి
స్పష్టమైన
ఆధిక్యం
లభించలేదు.
మొత్తం
స్థానాలు
222.
బీజేపీకి
104,
కాంగ్రెస్
కు
80,
జేడీ
ఎస్
కు
37
వచ్చాయి.
యడ్యూరప్ప
ఆధ్వర్యంలో
బీజేపీ
ప్రభుత్వాన్నిఏర్పాటు
చేసినా
నిలవలేదు.
తర్వాత
కుమారస్వామి
ముఖ్యమంత్రిగా
సంకీర్ణ
ప్రభుత్వం
కొలువుతీరింది.
2019లో
కాంగ్రెస్,
జేడీ
ఎస్
నుంచి
16
మందిని
బీజేపీ
తనవైపు
తిప్పుకొని
ప్రభుత్వాన్ని
ఏర్పాటు
చేసింది.
మణిపూర్
లో
2017లో
జరిగిన
ఎన్నికల్లో
కాంగ్రెస్
28
చోట్ల
విజయం
సాధించింది.
మొత్తం
స్థానాలు
60.
అయితే
గవర్నర్
21
స్థానాలు
సాధించిన
బీజేపీని
ప్రభుత్వ
ఏర్పాటుకు
ఆహ్వానించారు.
9
మంది
కాంగ్రెస్
ఎమ్మెల్యేల
మద్దతుతో
బీజేపీ
ప్రభుత్వాన్ని
ఏర్పాటు
చేయగలిగింది.
గవర్నర్
నిర్ణయంపై
దేశవ్యాప్తంగా
విమర్శలు
వచ్చాయి.

జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో..
జమ్మూ
కాశ్మీర్
లో
2014లో
జరిగిన
ఎన్నికల్లో
ఏ
పార్టీకి
మెజారిటీ
లభించలేదు.
బీజేపీ
25
సీట్లు,
పీడీపీ
28
సీట్లు
సాధించాయి.
ఈ
రెండు
పార్టీల
మధ్య
సయోధ్య
కుదరలేదు.
కొద్దిరోజుల
తర్వాత
పీడీపీతో
అధికారం
పంచుకోవడానికి
కమలంపార్టీ
ముందుకు
రావడంతో
సంకీర్ణ
ప్రభుత్వం
ఏర్పాటైంది.
2018లో
బీజేపీ
మద్దతు
ఉపసంహరించుకోవడంతో
ప్రభుత్వం
కూలిపోయింది.
2016
మార్చినెలలో
9
మంది
కాంగ్రెస్
ఎమ్మెల్యేలు
ఉత్తరాఖండ్
లో
ప్రభుత్వానికి
మద్దతు
ఉపసంహరించుకున్నారు.
కాంగ్రెస్
ప్రభుత్వం
సంక్షోభంలో
పడింది.
కేంద్రం
రాష్ట్రపతి
పాలన
విధించింది.
సుప్రీంకోర్టు
జోక్యంతో
కాంగ్రెస్
పార్టీ
మళ్లీ
ప్రభుత్వాన్ని
ఏర్పాటు
చేయగలిగింది.

బీహార్, అరుణాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో..
2015
అసెంబ్లీ
ఎన్నికల
అనంతరం
జేడీయూ,
ఆర్
జేడీ,
కాంగ్రెస్
కూటమిగా
ప్రభుత్వం
ఏర్పాటైంది.
కూటమిలో
బీజేపీ
చీలికలు
తెచ్చింది.
2017లో
కూటమి
నుంచి
జేడీయూ
బయటకు
వచ్చింది.
నితీష్
ముఖ్యమంత్రిగా
జేడీయూ,
బీజేపీ
సంకీర్ణ
సర్కారు
కొలువుతీరింది.
2014
ఎన్నికల్లో
కాంగ్రెస్
అరుణాచల్
ప్రదేశ్
లో
60
సీట్లకు
42
సీట్లు
సాధించింది.
బీజేపీకి
11
దక్కాయి.
2016లో
ముఖ్యమంత్రి
పెమా
ఖండూ
సహా
41
మంది
ఎమ్మెల్యేలు
కాంగ్రెస్
పార్టీ
నుంచి
ఫిరాయించారు.
బీజేపీ
ఆధ్వర్యంలో
ఏర్పాటు
చేసిన
నార్త్
ఈస్ట్
డెమోక్రటిక్
అలయెన్స్
కు
పీపుల్స్
పార్టీ
ఆఫ్
అరుణాచలప్రదేశ్
లో
చేరారు.
తర్వాత
వారంతా
బీజేపీ
తీర్థం
పుచ్చుకున్నారు.
గోవాలో
2017లో
జరిగిన
ఎన్నికల్లో
40
సీట్లకు
కాంగ్రెస్
17
స్థానాలు
గెలుచుకుంది.
బీజేపీకి
13
వచ్చాయి.
ఇతర
పార్టీలకు
చెందిన
పదిమంది
సభ్యలు,
ఒక
కాంగ్రెస్
ఎమ్మెల్యే
మద్దతుతో
బీజేపీ
ప్రభుత్వం
ఏర్పాటు
చేయగలిగింది.
2019లో
కాంగ్రెస్
నుంచి
మరో
15
మంది
బీజేపీలో
చేరారు.