పదో రోజూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: మొత్తంగా రూపాయి తగ్గింది
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు కొద్దిరోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. పదోరోజైన శుక్రవారం కూడా స్వల్పంగా ధరలు తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 21 పైసలు, లీటర్ డీజిల్ ధర 15 పైసలు తగ్గినట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.
కాగా, శుక్రవారం నాటి తగ్గింపుతో కలిపి పెట్రోల్ ధరలూ రూపాయి వరకు తగ్గాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.42గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.68.58గా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం.. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.24గా, కోల్కతాలో 80.07గా ఉంది. డీజిల్ ధర ముంబైలో లీటర్కు రూ.72.4కాగా, కోల్కతాలో రూ. 73.02గా ఉంది.
డీజిల్ ధర జూన్ 3న మినహా మిగితా రోజుల్లో స్వల్పంగానే తగ్గింది. ఈ పది రోజుల కాలంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 1.01 పైసలు, లీటర్ డీజిల్ ధర 73పైసలు తగ్గింది. పెట్రోల్ ధర కోల్కతాలో 99పైసలు, ముంబైలో రూపాయి, చెన్నైలో రూ.1.06పైసలు తగ్గింది. డీజిల్ లీటర్ ధర కోల్కతాలో 73పైసలు, ముంబైలో 77పైసలు, చెన్నైలో 78పైసలు తగ్గింది.