అత్యాచారం ఎలా జరిగిందో బొమ్మ గీసిన బాలిక, నిందితుడికి ఐదేళ్ల శిక్ష
తనపై జరిగిన అత్యాచారం ఘటనను ఓ బాలిక బొమ్మలు వేసి చూపించింది. ఈ బొమ్మల ఆధారంగా నిందితులకు కోర్టు శిక్ష వేసింది.నిందితుడికి ఐదేళ్ళపాటు శిక్ష విధించింది.
కోల్ కత్తా: తనపై జరిగిన అత్యాచారం ఘటనను ఓ బాలిక బొమ్మలు వేసి చూపించింది. ఈ బొమ్మల ఆధారంగా నిందితులకు కోర్టు శిక్ష వేసింది.నిందితుడికి ఐదేళ్ళపాటు శిక్ష విధించింది.
నిలువ నీడ ఇచ్చాననే ధీమాతో ఓ వ్యక్తి 8 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ అత్యాచారానికి సంబందించి ఎలాంటి సాక్ష్యాలు లేవనే నిందితుడు సంబంరంలో ఉన్న సమయంలోనే కోర్టు అనుహ్యంగా తీసుకొన్న నిర్ణయం నిందితుడికి జైలు శిక్ష పడేలా చేసింది.
కోల్ కత్తాకు చెందిన ఓ బాలిక ఢిల్లీలోని తన మామయ్య అక్తర్ అహ్మద్ ఇంటిలో ఉండి చదువుకొంటోంది. రెండేళ్ళ క్రితం ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఆరోపణలతో అక్తర్ ను గత ఏడాది జూన్ లో అరెస్టు చేశారు పోలీసులు.అయితే ఈ అత్యాచారం కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడు తప్పించుకొనే అవకాశం ఉందని పోలీసులు బావించారు.
విచారణలో భాగంగా కోర్టులో బాలికకు ఓ పేపర్ క్రేయాన్లు ఇచ్చి ఏం జరిగిందో బొమ్మ గీసి చూపించమన్నారు. బాలిక తనపై జరిగిన అత్యాచారం తీరును కళ్ళకు కట్టినట్టు బొమ్మ గీసీ చూపించింది. దీంతో నిందితుడికి కోర్టు ఐదేళ్ళ శిక్ష విధించింది.