మోడీకి నల్లరంగు పూయండి 25 లక్షలు గెలుచుకొండి
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖానికి నల్లరంగు పూస్తే తాను 25 లక్షలను బహుమతిగా ఇస్తానని కోల్ కత్తా టిప్పు సుల్తాన్ మజీద్ ఇమామ్ బర్కతీ ప్రకటించారు. ఈ ప్రకటనపై బిజెపి నాయకులు మండిపడుతున్నారు. ఆయనపై ఫిర్యా
కోల్ కత్తా :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖానికి నల్ల రంగు పూస్తే వారికి రూ.25 లక్షల రూపాయాలు ఇస్తానంటూ కోల్ కత్తాలోని టిప్పుసుల్తాన్ మసీదు ఇమామ్ నూరుర్ రెహ్మన్ బర్కతీ ఫత్వా జారీ చేశాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు బర్కతీ మారుపేరుగా నిలుస్తాడు. బర్కతీపై బిజెపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెద్ద నగదునోట్ల రద్దు వల్ల దేశంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని బర్కతీ అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా పత్వా జారీ చేశాడు.
ప్రధానమంత్రి మోడీ ముఖానికి నల్లరంగు పూస్తే 25 లక్లల రూపాయాలను బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించాడు. ఈ పత్వాపై బర్కతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద నగదు నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా 127 మంది చనిపోయారని , ఈ చావులకు మోడీ కారణమని ఆయన అబిప్రాయపడుతున్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని విమర్శించిన బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పై ఆయన ఫత్వా జారీ చేశాడు. గతంలో సల్మాన్ రష్థీ, తస్లీమా నస్రీన్, తారిక్ ఫతఫే లాంటి వారికి కూడ బర్కతీ ఫత్వాలు జారీ చేశాడు.