చేతులు కాలాకా .. కోల్కతా స్కూల్ టాయలెట్ల వద్ద రిజిస్టార్ .. ఎందుకో తెలుసా ?
కోల్కతా : ఏదైనా ఘటన జరిగిన తర్వాత మన పాలకులు కళ్లు తెరుస్తారు. ఇది సహజం. కానీ తర్వాత మరచిపోతారు. జాగ్రత్తల సోయి ఉండదు. దీంతో సమస్య వచ్చింది. ఇటీవల కోల్కతాలో ఓ స్కూల్ టాయిలెట్లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. దీంతో మిగతా విద్యాసంస్థలు కళ్లు తెరిచాయి. విద్యార్థులనే డేగ కళ్లతో పర్యవేక్షిస్తామని బీరాలు పలుకుతుంది.
అలర్ట్
..
అలర్ట్
...
ఇటీవల
కోల్కతా
స్కూల్
బాత్రూంలో
ఓ
స్టూడెంట్
బలవన్మరణానికి
పాల్పడటంత
మిగతా
విద్యాసంస్థలు
అప్రమత్తమయ్యాయి.
విద్యార్థుల
ప్రతీ
చర్యను
నిశీతంగా
గమనించాలని
నిర్ణయించుకున్నాయి.
తమ
పాఠశాలలో
జూలై
1
నుంచి
టాయిలెట్ల
వద్ద
రిజిస్టర్
పెడతామని
పేర్కొంది.
అంటే
ఏ
విద్యార్థి
టాయిలెట్
వెళ్తున్నాడు
?
ఎంత
సమయం
ఉంటున్నాడు
?
బయటకు
ఎప్పుడు
వస్తున్నాడు
?
వెళ్లే
సమయం,
వచ్చే
సమయం
రిజిస్ట్రార్లో
తప్పనిసరిగా
నోట్
చేస్తామని
సౌత్
సిటీ
ఇంటర్నేషనల్
స్కూల్
యాజమాన్యం
తెలిపిందని
టెలీగ్రాఫ్
రిపోర్ట్
చేసింది.
డేగకళ్లతో పర్యవేక్షణ ..
ఈ కొత్త చర్యతో విద్యార్థులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే తెలిసిపోతుందని యాజమాన్యం తెలపింది. వాస్తవానికి వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలనుకున్నామని .. కానీ విద్యార్థునులు, విద్యార్థిల వాష్ రూం వద్ద రికార్డు చేసేందుకు తమక సిబ్బది అవసరమవుతారని .. అందేకు ఆలస్యమైందన్నారు. దీంతో ఏమైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే తెలిసిపోతుందని ప్రిన్సిపాల్ జాన్ బాగుల్ తెలిపారు. గతవారం ఓ పాఠశాలలో విద్యార్థిని స్కూల్ బాత్ రూంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ బ్యాగ్తో మొహనికి చుట్టుకొని కనిపించింది. అయితే ఆమె చేతిపై గాయాలు కనిపించడంతో ఆత్మహత్యనా ? హత్యనా అనే అనుమానాలు కలిగాయి. దీంతో మిగతా విద్యాసంస్థలు కూడా అలర్టయ్యాయి. తమ స్కూళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాము తీసుకుంటున్న ఈ చర్యలు కేవలం విద్యార్థుల శ్రేయస్సు కోసమేనని చెప్తున్నాయి. అంతేకాదు దీనిపై టీచర్లు .. విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నాయి.