వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేతులు కాలాకా .. కోల్‌కతా స్కూల్ టాయలెట్ల వద్ద రిజిస్టార్ .. ఎందుకో తెలుసా ?

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : ఏదైనా ఘటన జరిగిన తర్వాత మన పాలకులు కళ్లు తెరుస్తారు. ఇది సహజం. కానీ తర్వాత మరచిపోతారు. జాగ్రత్తల సోయి ఉండదు. దీంతో సమస్య వచ్చింది. ఇటీవల కోల్‌కతాలో ఓ స్కూల్‌ టాయిలెట్‌లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. దీంతో మిగతా విద్యాసంస్థలు కళ్లు తెరిచాయి. విద్యార్థులనే డేగ కళ్లతో పర్యవేక్షిస్తామని బీరాలు పలుకుతుంది.

అలర్ట్ .. అలర్ట్ ...
ఇటీవల కోల్‌కతా స్కూల్ బాత్రూంలో ఓ స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడటంత మిగతా విద్యాసంస్థలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థుల ప్రతీ చర్యను నిశీతంగా గమనించాలని నిర్ణయించుకున్నాయి. తమ పాఠశాలలో జూలై 1 నుంచి టాయిలెట్ల వద్ద రిజిస్టర్ పెడతామని పేర్కొంది. అంటే ఏ విద్యార్థి టాయిలెట్ వెళ్తున్నాడు ? ఎంత సమయం ఉంటున్నాడు ? బయటకు ఎప్పుడు వస్తున్నాడు ? వెళ్లే సమయం, వచ్చే సమయం రిజిస్ట్రార్‌లో తప్పనిసరిగా నోట్ చేస్తామని సౌత్ సిటీ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తెలిపిందని టెలీగ్రాఫ్ రిపోర్ట్ చేసింది.

Kolkata school to time students bathroom breaks after shocking suicide

డేగకళ్లతో పర్యవేక్షణ ..

ఈ కొత్త చర్యతో విద్యార్థులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే తెలిసిపోతుందని యాజమాన్యం తెలపింది. వాస్తవానికి వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలనుకున్నామని .. కానీ విద్యార్థునులు, విద్యార్థిల వాష్ రూం వద్ద రికార్డు చేసేందుకు తమక సిబ్బది అవసరమవుతారని .. అందేకు ఆలస్యమైందన్నారు. దీంతో ఏమైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే తెలిసిపోతుందని ప్రిన్సిపాల్ జాన్ బాగుల్ తెలిపారు. గతవారం ఓ పాఠశాలలో విద్యార్థిని స్కూల్ బాత్ రూంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ బ్యాగ్‌తో మొహనికి చుట్టుకొని కనిపించింది. అయితే ఆమె చేతిపై గాయాలు కనిపించడంతో ఆత్మహత్యనా ? హత్యనా అనే అనుమానాలు కలిగాయి. దీంతో మిగతా విద్యాసంస్థలు కూడా అలర్టయ్యాయి. తమ స్కూళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాము తీసుకుంటున్న ఈ చర్యలు కేవలం విద్యార్థుల శ్రేయస్సు కోసమేనని చెప్తున్నాయి. అంతేకాదు దీనిపై టీచర్లు .. విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నాయి.
English summary
Just a few days after a student was found dead at a school in Kolkata, another school in the city has decided to keep tabs on the time spent by students in bathrooms. The principal of South City International School announced during an assembly on Monday that students will have to mention their 'in and out time' whenever they need to use toilets, said a report in The Telegraph. The new rule, which will be implemented from Monday (July 1), is a measure that the school has taken to know where each student is, in case anything goes wrong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X