తల్లి స్నేహితురాలి మీద టెక్కీ అత్యాచారయత్నం: బాత్ రూంలో సిగరేట్, చివరికి బెంగళూరులో!
బెంగళూరు: తల్లి స్నేహితురాలి మీద అత్యాచారయత్నం చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరును బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అర్దరాత్రి తల్లి స్నేహితురాలి గదిలోకి వెళ్లి వికృతచేష్టలు చేసిన టెక్కీని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
కోల్ కత్తాకు చెందిన ప్రైవేటు కంపెనీ నిర్వహకులు బెంగళూరు నగరంలోని యశవంతపురంలోని తాజ్ హోటల్ లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోల్ కత్తాకు చెందిన ముఖర్జీ (29) ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ప్రవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 39 సంవత్సరాల మహిళ, ముఖర్జీ తన తల్లితో కలిసి బెంగళూరులోని యశవంతపురంలోని తాజ్ హోటల్ జరిగిన కార్యక్రమానికి హాజరైనారు. తల్లి స్నేహితురాలి మీద ముఖర్జీ కన్ను వేశాడు. రాత్రి 11.45 గంటల సమయంలో మంచి నీళ్లు తాగాలని తల్లి స్నేహితురాలి గదిలోకి ముఖర్జీ వెళ్లాడు.
తరువాత తల్లి స్నేహితురాల మీద ముఖర్జీ అత్యాచారయత్నం చేశాడు. ఆ సమయంలో ఆ మహిళ ఎదురుతిరిగింది. ఆ సమయంలో ముఖర్జీ తల్లి స్నేహితురాలిని బాత్ రూంలోకి తీసుకెళ్లి బలవంతంగా ఆమెతో సిగరేట్ తాగించి వికృతచేష్టలు చేశాడని సమాచారం. భాదితురాలు ఫిర్యాదు చెయ్యడంతో ఆర్ఎంసీ యార్డు పోలీసులు ముఖర్జీని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.