కాలినడకన వెళ్లి, గవర్నర్కు రాజీనామా లేఖ ఇచ్చిన సీఎం...వెంటనే ఆమోదించిన గవర్నర్
సభలో మెజారిటి నిరుపించుకోలేని సీఎం కుమారస్వామి గవర్నర్కు రాజీనామ లేఖను సమర్పించేందుకు కాలినడకన రాజ్భవన్కు బయలదేరారు. అనంతరం గవర్నర్కు తన రాజీనామ లేఖను అందించారు. రాజీనామ లేఖ అందించిన కాసేపటికే గవర్నర్ కుమారస్వామి రాజీనామాను అమోదిస్తున్నట్టు ప్రకటించారు.
ఈనేపథ్యంలోనే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఎలాంటీ అధికారాలు అనుభవించలేదని ,ఎలాంటీ ప్రభుత్వ సదుపాయాలు తీసుకోలేదని సభలో చెప్పిన కుమారస్వామి అందుకు అనుగుణంగానే రాజ్భవన్కు కాలినడకన బయలు దేరారు.
14 నెలల పాటు కర్ణాటకలో కొనసాగిన కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం మెజారీటీ లేక కూలిపోయింది. రెండు వారాలపాటు సంకీర్ణ ప్రభుత్వం తన ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఇన్నాళ్లు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఈనేపథ్యంలోనే కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది.
HD Kumaraswamy arrives at Raj Bhavan in Bengaluru. Kumaraswamy led Congress-JD(S) government lost trust vote in the assembly, today. pic.twitter.com/F9gTYxRup8
— ANI (@ANI) July 23, 2019
ఇక సభలో మెజారీటి సభ్యులున్న బీజేపీని అధికారం చేపట్టేందుకు గవర్నర్ అహ్వానించనున్నారు. అంతకంటే ముందు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా బీజేపీ గవర్నరును కొరనున్నారు. దీంతో గవర్నర్ నిర్ణయంతో సభలో మరోసారి నూతన ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునే పరిస్థితి నెలకోంది.ఈ నేపథ్యంలోనే జూలై 25 ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.
Bengaluru: HD Kumaraswamy submits his resignation to Karnataka Governor, Vajubhai Vala. pic.twitter.com/uXxsucfat7
— ANI (@ANI) July 23, 2019