చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజలతోనే దీపావళి: జయను కలిసిన ఖుస్బూ

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కాంగ్రెస్ నేత, నటి ఖుష్బూ సోమవారం కలిశారు. అనారోగ్య కారణంగా జయలలిత గత కొద్దిరోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలితను చూసి వచ్చినట్లు ఖుష్బూ ట్వీట్‌ చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి బావుందని, మరింత త్వరగా ఆమె కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

kushboo prays the well being jayalalitha

ఈ దీపావళిని జయలలిత తమిళనాడు ప్రజలతో జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు ఖుష్బూ ట్వీట్టర్ ద్వారా ఆకాంక్షించారు. ఇది ఇలా ఉండగా, సోమవారం జయలలితకు వైద్యం అందించేందుకు లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు గిల్సానీలు అపోలో ఆస్పత్రికి వచ్చారు. వీరితోపాటు సింగపూర్‌కు చెందిన వైద్యులు జయలలితకు వైద్యం అందిస్తున్నారు.

కాగా, ఇప్పటికే జయలలిత కొంత కోలుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

English summary
Congress leader kushboo prayed the wellbeing CM jayalalitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X