బిజెపి అద్భుత గెలుపు: 30 ఏళ్ల తర్వాత తొలిసారి మేయర్ పదవి
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో తొలిసారి భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన కుసుమ్ సద్రెట్ మేయర్గా ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాల తర్వాత సిమ్లాలో బిజెపికి అద్భుత విజయం దక్కింది.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో తొలిసారి భారతీయ జనతా పార్టీ మద్దతు పలికిన కుసుమ్ సద్రెట్ మేయర్గా ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాల తర్వాత సిమ్లాలో బిజెపికి అద్భుత విజయం దక్కింది.
మంగళవారం సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కుసుమ్ సద్రెట్, డిప్యూటీ మేయర్గా రాకేష్ శర్మ ఎన్నికయ్యారు. జూన్ 17న ఇక్కడ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 34 సీట్లకు గాను 17 సీట్లను బిజెపి గెలిచింది. మెజారిటీకి ఒక్క సీటు దూరంలో నిలిచింది.
బిజెపి రెబల్గా బరిలోకి దిగి విజయం సాధించిన శర్మ తిరిగి పార్టీ గూటికి చేరడంతో బిజెపి ఆధిక్యం సంపాదించింది. ఫలితంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆ పార్టీ సొంతమయ్యాయి.
ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనప్పటికీ కాంగ్రెస్, బిజెపిలు మాత్రం తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి. కాగా, సిమ్లాలో 2012 వరకు కాంగ్రెస్ ఏకధాటిగా 26 ఏళ్లపాటు అధికారాన్ని చెలాయించింది.