Lady: అంబులెన్స్ లో అరాచకం, ఆంటీకి కరోనా పాజిటివ్, స్వర్గం చూపిస్తానని వాలింటర్ ఏం చేశాడంటే ?
కొచ్చి/చెన్నై: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి సోకిందని తెలిస్తే కన్న కొడుకులు తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను భర్త, భర్తను భార్య ముట్టుకోవడానికి సాహసం చెయ్యడం లేదు. ఎక్కడ కరోనా మాకు సోకి మా ప్రాణం పోతుందో అనే భయం సామన్య ప్రజలను వెంటాడుతోంది. అయితే కామాంధులకు మాత్రం కంటికి కనపడని కరోనా వ్యాధిని లెక్కచెయ్యడం లేదు. కరోనా నుంచి మమ్మల్ని కాపాడు దేవుడా అంటూ కరోనా రోగులు వేడుకుంటున్నారు. ఆంటీ ఒక్కసారికి అడ్జెస్ట్ చేసుకో అంటూ కామాంధుడు కరోనా రోగి మీద లైంగిక దాడులకు పాల్పడ్డాడు. సీటీ స్కెనింగ్ తీసుకోవడానికి అంబులెన్స్ లో వెలుతున్న మహిళను అంబులెన్స్ లో ఉన్న మెడికల్ వాలింటర్ నీకు స్వర్గం చూపిస్తా ఆంటీ అంటూ ఆమెను లైంగిక వేదింపులతో చిత్రహింసలకు గురి చెయ్యడం కలకలం రేపింది.

కేరళ ఆంటీకి కరోనా పాజిటివ్
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 45 మహిళ గత ఏప్రిల్ లో అనారోగ్యానికి గురైయ్యింది. అదే నెలలో వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నది. వివాహిత మహిళ దగ్గరే ఉంటూ ఆమెకు సహాయం చెయ్యడానికి ఆమె భర్తతో పాటు బంధువులు ఎవ్వరూ సాహసం చెయ్యలేకపోయారు.

అంబులెన్స్ లో సీటీ స్కానింగ్ కు
కోవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళకు ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రిలో సీటీ స్కానింగ్ చెయ్యాలని వైద్యులు సూచించారు. మహిళను అంబులెన్స్ లో సీటీ స్కానింగ్ సెంటర్ కేంద్రానికి తీసుకెళ్లారు. కరోనా భయంతో ఆమె కుటుంబ సభ్యులు ఎవ్వరూ అంబులెన్స్ లో వెళ్లడానికి సాహసం చెయ్యలేకపోయారు. అదే అంబులెన్స్ మెడికల్ అసిస్టెంట్ (వాలంటీర్) ప్రశాంత్ (33) అనే కామాంధుడు ఆమె వెంట వెళ్లాడు.

ఆంటీ ఒక్క చాన్స్ ఇవ్వు... నీకు స్వర్గం చూపిస్తా
అంబులెన్స్ ముందు సీట్లలో డ్రైవర్, ఆమె బంధువు ఒకరు కుర్చున్నారు. అంబులెన్స్ లోపల కోవిడ్ బాధితురాలు, కామాంధుడు ప్రశాంత్ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారి మేడమ్, నా కోరిక తీర్చు, నీకు స్వర్గం చూపిస్తా, నీకు కరోనా వ్వాధి నయం చెయ్యాలని వైద్యులకు నేను సలహా ఇస్తానని ప్రశాంత్ అంబులెన్స్ లోపల కోవిడ్ బాధితురాలిపై లైంగిక దాడి చేశాడు. అంబులెన్స్ సీటీ స్కానింగ్ కేంద్రానికి వెళ్లే వరకు మెడికల్ అసిస్టెంట్ ప్రశాంత్ అంబులెన్స్ లో ఉన్న మహిళకు నరకం చూపించాడు.

దెబ్బకు కేటుగాడి నరాలకు మసాజ్
లైంగిక దాడి జరిగిన సమయంలో మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో ఆ సమయంలో ఆమె వైద్యులకు కాని, పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేకపోయింది. మే 13వ తేదీన బాధితురాలు కోలుకునింది. తరువాత అంబులెన్స్ లో జరిగిన దారణం మొదట వైద్యులకు చెప్పింది. వైద్యులు ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పోలీసులు మెడికల్ అసిస్టెంట్ ప్రశాంత్ ను నిన్న అరెస్టు చేశారు. కామంతో బిగుసుకుపోయిన ప్రశాంత్ నరాలకు పోలీసులు మసాజ్ (బెండ్) తీస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఇలా కోవిడ్ మహిళా రోగుల మీద లైంగిక దాడులు చేస్తున్నారని ప్రతిరోజు వెలుగు చూస్తూనే ఉంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications