కార్యాలయంలోనే మహిళ టెక్కిపై అత్యాచారయత్నం
బెంగళూరు: నిద్రపోతున్న మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద అదే కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి అత్యాచారయత్నం చేసిన సంఘటన బెంగళూరు నగరంలోని జేపీ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కామాంధుడిని అరెస్టు చేసి వివచారణ చేస్తున్నారు.
మండ్యకు చెందిన ప్రవీణ్ (21) అనే కామాంధుడిని అరెస్టు చేశామని శనివారం పోలీసులు చెప్పారు. బన్నేరుఘట్ట రోడ్డులోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఒక మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నారు. ఇదే కంపెనీలో ప్రవీణ్ అటెండర్ గా పని చేస్తున్నాడు.
మంగళవారం రాత్రి ఆ మహిళ టెక్కి నైట్ షిఫ్ట్ కు వెళ్లారు. విధులలో ఉన్న ఆమె బుధవారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో విషయం గుర్తించిన ప్రవీణ్ ఆమె క్యాబిన్ దగ్గరకు వెళ్లాడు.
నిద్రపోతున్న మహిళ మీద లైంగికదాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె కార్యాలయంలో సీపీ కెమెరాలు ఉన్నాయని, కారు పార్కింగ్ దగ్గరకు వెలుదామని అతనికి నచ్చ చెప్పింది. కిందకు వెళ్లిన తరువాత ఆమె సెక్కూరిటి గార్డులకు జరిగిన విషయం చెప్పింది. సెక్యూరిటిగార్డులు ప్రవీణ్ ను పట్టుకుని చితకబాది జేపీనగర పోలీసులకు అప్పగించారు.