చిక్కుల్లో లాలూ: జైల్లోని క్రిమినల్ నుంచి అల్లర్ల ఆదేశాలు!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్న డాన్, ఆర్జేడీ నేత మహ్మద్ షహబుద్దీన్తో లాలూ మాట్లాడుతున్నట్లు ఓ ఆడియో ట
న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్న డాన్, ఆర్జేడీ నేత మహ్మద్ షహబుద్దీన్తో లాలూ మాట్లాడుతున్నట్లు ఓ ఆడియో టేప్ బయటపడింది. లాలూకు షహబుద్దీన్ జైలు నుంచి ఫోన్ చేసి అల్లర్లకు సంబంధించిన ఆదేశాలు ఇస్తున్నట్లు ఈ టేపులో వినిపిస్తోంది.
ఈ ఆడియో టేపును ఈరోజే ప్రసారాలను ప్రారంభించిన ఓ టీవీ ఛానల్(అర్నబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ ఛానల్) విడుదల చేసింది. ఆ ఛానల్ కథనం ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్ ఈ టేపులపై స్పందించలేదు. ఈ టేపును ప్రసారం చేయవద్దని ఆయన అనేకసార్లు కోరినట్లు తెలిపింది.
లాలూ, షహబుద్దీన్ సంభాషణలపై స్పందించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను ఆ ఛానల్ కోరింది. కాగా, క్రిమినల్తో లాలూ సంభాషణలపై భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. లాలూ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.