వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైల్వే టెండర్ అక్రమాల కేసు: సిబిఐ విచారణకు లాలూ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు.రైల్వే హోటళ్ల టెండర్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న లాలూను గురువారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. రైల్వే హోటళ్ల టెండర్ కేసులో విచారణ ఎదుర్కుంటున్న లాలూను గురువారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు.
లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఓ రైల్వే హోటల్ టెండర్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా విచారణ జరుగుతోంది.
ఈ కేసులో లాలూ తనయుడు తేజస్వీ పైనా ఆరోపణలున్నాయి. గత నెల 10, 11 తేదీల్లో వీరిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు లాలును మరోసారి పిలిచారు.
Comments
English summary
Rashtriya Janata Dal (RJD) leader Lalu Prasad Yadav appeared before the CBI for questioning on Thursday in connection with the hotels-for-land scam. The central agency has accused Lalu of having “rigged and manipulated the tender process” while awarding contracts to two IRCTC hotels when he was Railways minister in 2006 under the UPA I government.
Story first published: Thursday, October 5, 2017, 13:07 [IST]