లాలూకు భారీ ఊరట- గడ్డి స్కాంలో నాలుగో కేసులో ఎట్టకేలకు బెయిల్..
ఆర్జేడీ దిగ్గజ నేత లాలూ ప్రసాద్ యాదవ్కు భారీ ఊరట లబించింది. పశువుల దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులను మళ్లించిన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చింది.
దాణా కుంభకోణానికి సంబంధించి నాలుగు కేసుల్లో లాలూకు శిక్ష ఖరారైంది. ఇందులో మూడింటికి ఇప్పటికే బెయిల్ లభించింది. తాజా బెయిల్తో.. జైలు నుంచి విడుదలయ్యేందుకు లాలూకు మార్గం సుగమమైంది.
బీహార్ సీఎంగా ఉన్న కాలంలో దుమ్కా ట్రెజరీ నుంచి 3.13 కోట్లు అదనపు నిధుల్ని విత్ డ్రా చేసిన కేసులో లాలూకు బెయిల్ మంజూరైంది. ట్రెజరీ నుంచి 37.7 కోట్ల రూపాయలను అధికంగా ఉపసంహరించుకున్న చైబాసా ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు గతంలోనే బెయిల్ లభించింది. తరువాత, డియోఘర్ ట్రెజరీ నుండి రూ .79 లక్షలు అధికంగా ఉపసంహరించుకున్న కేసులోనూ ఆయనకు బెయిల్ లభించింది. మరోవైపు చైబాసా ట్రెజరీ నుంచి రూ .33.13 కోట్లు అధికంగా ఉపసంహరించుకున్న కేసులోనూ లాలూకు బెయిల్ ఇచ్చారు. ఈ కేసులన్నింటిలోనూ, లాలూకు విధించిన మొత్తంలో సగం శిక్షను అనుభవించినందుకు ఈ బెయిల్ ఇచ్చారు.
ఫిబ్రవరి 19 న, లాలూ ప్రసాద్ యాదవ్ తన శిక్షలో సగం పూర్తి చేయడానికి 1 నెల 17 రోజులు తగ్గినందున బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. జైలులో చెప్పిన కాలం పూర్తయిన తరువాత, ఆయన్ను మరోసారి కోర్టులో బెయిల్ కోరారు. దీన్ని విచారించిన కోర్టు బెయిల్ ఇచ్చింది.
Recommended Video