మోదిలా మారిన లాలు యాదవ్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని నరేంద్రమోడిని డబ్స్మాష్ చేస్తూ సెటైర్లు వేశారు. మోదిలా మాట్లాడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు లాలు ప్రసాద్ యాదవ్. దాణా కుంభకోణంలో కోర్టుచేత బెయిల్ నిరాకరంచబడి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలు ప్రధానమంత్రి నరేంద్రమోడి 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను డబ్స్మాష్ చేశాడు. 17 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో లో దేశంలోని ప్రతి పౌరుడు 15 నుండి 20 లక్షల రుపాయలు పోందబోతున్నాడు అంటూ మోడి అచ్చేదిన్ నినాదాన్ని ఇచ్చాడు.
मुफ़्त में ले लो 15 लाख, अच्छे दिन और जुमला। pic.twitter.com/2Pfhg2QemK
— Lalu Prasad Yadav (@laluprasadrjd) April 13, 2019
దీంతో మోడి ఎప్పుడు పలికే సోదరసోదరీమణుల్లారా అనే పదాలకు లాలు డమ్ స్మాష్ చేస్తూ మోడి చేసిన ప్రకటనను రాజకీయంగా ఎద్దేవా చేశాడు.అయితే ఇలాంటీ పదాలతో ఆయన డబ్ స్మాష్ ఆడియో వైరల్ అవుతోంది.అయితే దీన్ని జైలు శిక్ష అనుభవిస్తున్న లాలు యాదవ్ ఎలా చేశాడనేది స్పష్టత లేదు.కాగా ఆయన వీడియోలో మాములు పౌరుడు వేసే టీషర్ట్స్ వేసుకుని ఉన్నారు. కాగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకువస్తే ప్రతి కుటుంభానికి 15 లక్షల రుపాయలు వారి ఖాతాలో పడతాయని ప్రకటించారు.
అయితే నల్లధనం రాకపోవడంతోపాటు మోదీపై రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టాయి విపక్షాలు ఇటివల రాహుల్ గాంధి సైతం ఇదే విషయాన్ని ప్రతి బహిరంగసభలో ప్రచారం చేస్తున్నారు. మోడి ప్రతి ఒక్కరి ఖాతల్లో 15 లక్షల రుపాయలు వేస్తానని మోసం చేశారని విమర్శిస్తూ తాను మాత్రం మోడిలా హామీలు ఇచ్చి మోసం చేయనని చెబుతున్నాడు.దీంతో తన కనీస ఆదాయ పథకాన్ని ప్రజల్లోకి తీసుకేళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.కాగా రాహుల్ గాంధికి తోడు ఇప్పుడు లాలుయాదవ్ చేసిన వీడియో ప్రజల్లో వైరల్ అవుతోంది.