వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019 ఎన్నికల్లో పోటీకి ఐశ్వర్యరాయ్ రెడీ, చాప్రా నుండి పోటీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ సతీమణి ఐశ్వర్యరాయ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా అనే విషయమై చర్చ సాగుతోంది. బీహర్ రాష్ట్రంలోని చాప్రా అసెంబ్లీ నియోజకవర్గం నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ సతీమణి ఐశ్యర్యరాయ్ పోటీ చేసే విషయమై ఆర్జేడీ చీఫ్ లాలూ‌ప్రసాద్ యాదవ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.

ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ సతీమణి ఐశ్వర్యరాయ్ బీహర్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ యాదవ్ మనమరాలు. తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఐశ్వర్యరాయ్ వివాహం మే 12వ తేదిన పాట్నాలో జరిగింది. ఈ వివాహం కోసం ప్రత్యేకంగా బెయిల్ పై లాలూ జైలు నుండి వచ్చాడు.

ఐశ్యర్యరాయ్ చాప్రా నియోజకవర్గానికి చెందింది. ఈ నియోజకవర్గం నుండి చాప్రా నుండి పోటీ చేస్తే బాగుంటుందని ఆర్జేడీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయమై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు.

Lalus daughter-in-law Aishwarya Rai may contest 2019 Lok Sabha elections

అయితే ఈ విషయమై ఆర్జేడీ నిర్ణయం తీసుకోకపోయినా ఆర్డేడీపై జెడియూ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్జేడీ కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేసినా కానీ వారికి కాదని లాలూ తన కుటుంబం కోసం టిక్కెట్లను కేటాయించుకొంటుందని జెడియూ నేతలు విమర్శిస్తున్నారు.

ఐశ్వర్యరాయ్ కూడ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది.దీంతో ఐశ్యర్యారాయ్ ను ఎన్నికల బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు.

English summary
Rashtriya Janata Dal (RJD) leader Tej Pratap Yadav’s wife Aishwarya Rai may contest in 2019 Lok Sabha elections for the party from Chhapra in Bihar. However, a decision in this regard is yet to be taken by the family of RJD supremo Lalu Prasad Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X