రాజకీయ కుట్రలో భాగమే సిబిఐ దాడులు: లాలూ
ఆర్జెడి చీఫ్, మాజీ కేంద్ర రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపై సిబిఐ దాడులు నిర్వహించింది.అయితే సిబిఐ దాడులు బిజెపి రాజకీయ కుట్రలో భాగమమన్నారు లాలూ ప్రస
పాట్నా: ఆర్జెడి చీఫ్, మాజీ కేంద్ర రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిపై సిబిఐ దాడులు నిర్వహించింది. అంతేకాదు ఆయనపై కేసులను కూడ నమోదుచేసింది.అయితే సిబిఐ దాడులు బిజెపి రాజకీయ కుట్రలో భాగమమన్నారు లాలూ ప్రసాద్ యాదవ్.
లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుండి 2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా ఆయన పనిచేశారు. ఓ ప్రైవేట్ హోటల్ కంపెనీకి ఆయన అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో సిబిఐ కేసు దాఖలుచేసింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ ద్వారా అ అవినీతి కార్యకలాపాలు జరిగినట్టు ఆరోపించింది.
ఈ కేసులో లాలూ సతీమణి రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వి, ఐఆర్సీటీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సీకె గోయల్ , లాలూ సహచరుడు ప్రేమ్చంద్ గుప్తా, ఆయన సతీమణి సరళగుప్తా ఉన్నారు. నిందితులకు సంబంధించిన 12 ప్రదేశాలపై సిబిఐ శుక్రవారం నాడు 12 చోట్ల దాడులు నిర్వహించింది. న్యూఢిల్లీ, గురుగ్రామ్, పాట్నా, రాంచీ, పూరీలలో ఈ దాడులు జరిగాయి.
అయితే సిబిఐ దాడుల గురించి లాలూ ప్రసాద్ మాట్లాడేందుకు నిరాకరించారు. దాణా స్కాం కేసులో లాలూ ఇవాళ సిబిఐ కోర్టుకు హజరయ్యారు. అయితే ఈ దాడులపై ఆయన స్పందించారు. ఆ కేసులో తన తప్పేమీ లేదన్నారు. అంతా పద్దతి ప్రకారంగానే జరిగిందన్నారు. బిజెపి కనుసన్నల్లోనే నడిచే సిబిఐ అంటూ ఆయన దుయ్యబట్టారు. ఈ విషయమై ఆయన కోర్టులో సవాల్ చేస్తానని ప్రకటించారు.