వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను చంపడానికి తాంత్రిక పూజలు -లాలూకు చేతబడి తెలుసు- దసరాకు జైల్లోనే జంతుబలి: మోదీ

|
Google Oneindia TeluguNews

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వెనుకబడిపోయిందన్న అంచనాలను నిజం చేస్తూ ఆ పార్టీ ముఖ్యనేత, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ.. ప్రత్యర్థులపై అనూహ్య ఆరోపణలకు దిగారు. ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ విషయంలో విమర్శలు ఎదుర్కోంటోన్న బీజేపీ తాజాగా మోదీ కామెంట్లపైనా ముప్పేటదాడిని చవిచూడాల్సిన పరిస్థితి. 15ఏళ్ల ఎన్డీఏ పాలనలో చెప్పుకోడానికి ఏమీ లేక ఇలాంటి చీప్ కామెంట్లు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇంతకీ సుశీల్ మోదీ ఏమన్నారంటే..

నితీశ్‌కు షాక్- చిరాగ్‌తో బీజేపీ చీకటి ఒప్పందం - సర్వత్రా విమర్శ - జేపీ నడ్డా ఏం చెప్పారంటే..నితీశ్‌కు షాక్- చిరాగ్‌తో బీజేపీ చీకటి ఒప్పందం - సర్వత్రా విమర్శ - జేపీ నడ్డా ఏం చెప్పారంటే..

లాలూ తాంత్రిక పూజలు..

లాలూ తాంత్రిక పూజలు..

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశించి, సీనియర్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వరుస ట్వీట్లు చేసిన మోదీ.. మూడేళ్ల కిందట తనను చంపడానికి లాలూ యాదవ్ తాంత్రిక కర్మలు చేశారని ఆరోపించారు. మీర్జాపూర్ వింధ్యచల్ థామ్ వద్ద ఆ తంతు జరిగిందని చెప్పారు. మహా తాంత్రికుడిగా పేరుపొందిన శంకర్ చరణ్ త్రిపాఠి అంటే లాలూకు బాగా గురి ఉందని, కాబట్టే త్రిపాఠిని ఆర్జేడీ జాతీయ ప్రతినిధిగానూ నియమించారని మోదీ తెలిపారు.

దసరాకు జంతు బలి..

దసరాకు జంతు బలి..

‘‘లాలూ ప్రసాద్ ప్రజల్ని నమ్మరు. కేవలం మూఢనమ్మకాలనే విశ్వసిస్తారు. కేవలం తాంత్రికులు చెప్పారనే ఆయన తెల్ల కుర్తా ధరించడం మానేశారు. జంతుబలి, ఆత్మలను ప్రార్థించడం ఆయనకు అలవాటైన పనులు. చేతబడి కూడా తెలుసు. ప్రస్తుతం రాంచీలోని జైలులో ఉన్న లాలూ.. నిబంధనలకు విరుద్ధంగా దసరా పండుగ రోజున మూడు మేకల్ని బలి ఇవ్వబోతున్నారు'' అని సుశీల్ మోదీ పేర్కొన్నారు. ఇన్ని తాంత్రిక పూజలు చేసినా లాలూ జైలు నుంచి తప్పించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

ఇండియాను అలా తిట్టడం తప్పు - ట్రంప్‌ ‘కంపు'పై బైడెన్ ఫైర్ - మాస్క్ మ్యాటర్స్ -హత్యకు కుట్రఇండియాను అలా తిట్టడం తప్పు - ట్రంప్‌ ‘కంపు'పై బైడెన్ ఫైర్ - మాస్క్ మ్యాటర్స్ -హత్యకు కుట్ర

Recommended Video

Bihar Polls : Article 370 పునరుద్ధరన Bihar నుంచి అమరవీరులైన జవాన్లకు అవమానం! - PM Modi
నాడు తెలంగాణలో సూర్యగ్రహణం రోజునా..

నాడు తెలంగాణలో సూర్యగ్రహణం రోజునా..

2009లో సూర్యగ్రహణాన్ని చూసేందుకు తెలంగాణ(ఉమ్మడి ఆంధ్ర)కు వెళ్లిన నితీశ్.. గ్రహణం సమయంలో బిస్కెట్లు తిన్నందుకు బీహార్ లో కరువు ఏర్పడుతుందని లాలూ శపించారని, కానీ ఆ ఏడాది బీహార్ లో పంటలు బాగా పండాయని, లాలూ మూఢనమ్మకాలకు ఇవి చాలా చిన్న ఉదాహరణలని బీజేపీ నేత సుశీల్ మోదీ అన్నారు. నితీశ్ పాలనలో పాలనలో బీహార్ అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఎంత ప్రయత్నించినా ఎన్డీఏనే గెలుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ లో ఈనెల 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో పోలింగ్ జరుగనుంది.

English summary
Ahead of the Bihar Assembly elections 2020, Bihar Deputy Chief Minister Sushil Kumar Modi has claimed that Rashtriya Janata Dal (RJD) supremo Lalu Prasad Yadav had performed tantric rituals to kill him three years ago. sushil modi allegations about Lalu Yadav's lifestyle and his belief in black magic. "Lalu Prasad is so superstitious that he not only stopped wearing a white kurta at the behest of the tantrik, but also made Tantrik Shankar Charan Tripathi the national spokesperson of the party," Sushil Modi tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X