వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం, కాశ్మీర్ పండిట్‌ను చంపిన ఉగ్రవాది కూడా

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా దళాలతో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ రాథర్‌తో సహా ముగ్గురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ జోన్ పోలీసుల ప్రకారం.. లతీఫ్.. కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్, టెలివిజన్ ఆర్టిస్ట్ అమ్రీన్ భట్‌లతో సహా అనేక పౌర హత్యలలో పాల్గొన్నాడు.

"రాహుల్ భట్, అమ్రీన్ భట్‌ల హంతకుడు, ఉగ్రవాది లతీఫ్ అలియాస్ అబ్దుల్లా బుధవారం హతమైన ముగ్గురు ఉగ్రవాదులలో ఉన్నాడు. అతను పౌర హత్యలు, ఇతర దురాగతాలతో సహా అనేక టెర్రర్ క్రైమ్ కేసులలో పాల్గొన్నాడు" అని ఏడీజీపీ (కశ్మీర్ జోన్) విజయ్ కుమార్ తెలిపారు.

 Lashkar Terrorist Who Shot Kashmiri Pandit Rahul Bhat Among Three Killed In Encounter, Budgam

ఘటనా స్థలంలో నేరారోపణ చేసే పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇది తమకు పెద్ద విజయం అని విజయ్ కుమార్ అన్నారు.

ఉగ్రవాదుల ఉనికి గురించి ఇన్‌పుట్‌ల నేపథ్యంలో భద్రతా బలగాలు జిల్లాలోని ఖాన్‌సాహిబ్ ప్రాంతంలోని వాటర్‌హైల్ వద్ద కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఎన్‌కౌంటర్ జరిగింది.

English summary
Lashkar Terrorist Who Shot Kashmiri Pandit Rahul Bhat Among Three Killed In Encounter, Budgam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X