జవాన్ల వల్లే దేశం.. దేశం వల్లే మనం: సైన్యానికి లతామంగేష్కర్ ‘భాయ్దూజ్’ శుభాకాంక్షలు
నేడు భాయ్దూజ్.. అంటే భగిని హస్త భోజనం అని అర్థం. దీపావళి రెండో రోజు జరుపుకునే ఈ పర్వదినాన అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తుంటారు.
ముంబై: నేడు భాయ్దూజ్.. అంటే భగిని హస్త భోజనం అని అర్థం. దీపావళి రెండో రోజు జరుపుకునే ఈ పర్వదినాన అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తుంటారు.
ఈ 'భాయ్దూజ్' పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ భారత జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫేస్బుక్లో ప్రత్యేక వీడియో సందేశాన్ని ఆమె పోస్టు చేశారు.
'భారత జవాన్లకు నమస్కారం. 'భాయ్దూజ్' శుభాకాంక్షలు. నేనూ మీ సోదరిమణుల్లో ఒకరినే. మీరంటే నాకు చాలా గౌరవం. మన జవాన్లు ఎల్లప్పుడూ ఆనందంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా..' అని తెలిపారు.
అంతేకాదు, 'ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. జవాన్ల వల్లే ఈ భారతదేశం ఉంది. భారతదేశం వల్లే మనమంతా ఉన్నాం. ఇది నిజం. దేశం కోసం పోరాడుతున్న జవాన్లకు సెల్యూట్ చేస్తున్నాను. వారికి నాదో విన్నపం.. నా నుంచి ఏమైనా సాయం కావాల్సి వస్తే అడగండి, అందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను...' అని లతా మంగేష్కర్ తన ఫేస్ బుక్ వీడియోలో చెప్పారు.