మొసలికి సినిమా చూపించిన స్థానికులు
బెంగళూరు: మొసలిని చూస్తే సామాన్యగా ఎవ్వరూ ఆ చుట్టు పక్కల ప్రాంతంలో కనిపించరు. అయితే కొందరు గ్రామస్తుల చేతిలో మొసలి చావుదెబ్బలు తిన్న సంఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని యాదగిరి జిల్లా, శివనూరు గ్రామం సమీపంలో ఈ సంఘటన జరిగింది.
గ్రామం సమీపంలోని ఓ నీటిమడుగు నుంచి మొసలి బయటకు వచ్చింది. అటు వైపు వెలుతున్న వ్యక్తి విషయం గుర్తించి పరుగు తీసి గ్రామస్తులకు విషయం చెప్పాడు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాళ్లు, ఇటుకలు తీసుకుని మొసలి మీద దాడి చెయ్యడం మొదలు పెట్టారు.
అది తప్పించుకోకుండా చుట్టు నిలబడ్డారు. చావు దెబ్బలు తిన్న మొసలి కదలలేక అలాగే ఉండిపోయింది. ఓ యువకుడు మొసలి తోక పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. అయితే మొసలి కొంచెం కూడ చలించలేదు. మరో ఇద్దరు గ్రామస్తులు మొసలి తోకను పట్టుకుని లాగారు.
మొసలి కొంచెం కదిలింది. ఆ సందర్బంలో గ్రామస్తులు భయంతో పరుగు తీశారు. మళ్లి మొసలి దగ్గరకు చేరుకుని దాని మీద రాళ్లతో దాడి చేశారు. ఓ యువకుడు మొసలి మీద నిలబడి ఫోటోలు తీసుకున్నాడు. ఈ తతంగం మొత్తం మొబైలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అటవి శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మొసలిని స్వాధీనం చేసుకున్నారు.