డోక్లాం ప్రతిష్టంభన నుంచి పాఠాలు నేర్చుకోండి: భారత్కు చైనా ఆర్మీ విజ్ఞప్తి
డోక్లాం వివాదం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందిగా చైనా ఆర్మీ ఇండియాను కోరింది.
బీజింగ్: బ్రిక్స్ సమావేశం నేపథ్యంలో చైనా-భారత్ మధ్య నెలకొన్న డోక్లాం వివాదానికి తెరపడిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ బ్రిక్స్ వేదికగా దీనిపై నిరసన తెలిపే అవకాశం ఉన్నందునా చైనా ముందస్తుగా జాగ్రత్తపడింది. డోక్లాం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుంది.
చైనా ఎందుకు తోక ముడిచింది?: నిజాలివే.. డోక్లాం ప్రతిష్టంభనపై మోడీ అలా చేస్తారనే?
ఇరు దేశాలు డోక్లాం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్ కు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు పీఎల్ఏ సీనియర్ కల్నల్ కియాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'భారత్-చైనా ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా ఆర్మీ ఇక నుంచి ఎంతో అప్రమత్తంగా ఉంటూ జాతీయ ప్రాదేశికతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుతుంది' అని కియాన్ అన్నారు.
డోక్లాం ప్రతిష్టంభన వివాదం నుంచి భారత్ పాఠాలు నేర్వాల్సిందిగా చైనా సూచించింది. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దుల్లో సుస్థిరతను కాపాడటానికి, శాంతిని పెంపొందించడానికి ఇరు దేశాల సైన్యం మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాల్సిందిగా కోరారు.