జేఎన్యూ లో ఏబివీపీకి ఎదురుదెబ్బ... అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి విజయం
ఢిల్లీ జవహార్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో అధికార బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇటివల జరిగిన యూనివర్సిటి ఎన్నికల్లో వామపక్ష విద్యార్ధి సంఘమైన ఎస్ఎఫ్ఐ అధ్యక్ష పదవిని స్వంతం చేసుకోంది. ఏబీవీపీ అభ్యర్ధి మనిష్ జంగిడ్ పై ఎస్ఎఫ్ఐ నాయకుడు అశీష్ విజయాన్ని కైవసం చేసుకున్నాడు.కాగా పదమూడు సంవత్సరాల తర్వాత ఎస్ఎఫ్ఐ నాయకుడు యూనివర్సిటి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గమనార్హం.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘమైన ఏబీవీపికి జేఎన్యూలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు వాపపక్ష స్టూడెంట్ యూనియన్లు కలిసి ఏబీవీపీకి చెక్ పెట్టాయి. ఎస్ఎఫ్ఐ,డీఎస్ఎఫ్, ఏఐఎస్ఏ,ఏఐఎస్ఎఫ్,లు కలిసి పోటి చేశాయి. మొత్తం ఎన్నికల్లో 5700 మంది విద్యార్ధలు ఓటింగ్లో పాల్గోనగా ఎస్ఎఫ్ఐ నాయకుడికి 2313 ఓట్లు రాగా, ఏబీవీపీకి 1128 ఓట్లు పడ్డాయి. అయితే ఆర్టికల్ 370 తర్వాత బీజేపీకి బలం పెరిగిందనే యోచనలో ఆపార్టీ నాయకులు ఉన్నారు. కాని తాజాగా ఆపార్టీకి ఎదురదెబ్బ తగిలింది.