వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రీడా దిగ్గజం మిల్కా సింగ్ సతీమణి నిర్మల్(85) కరోనాతో మృతి

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: దిగ్గజ క్రీడాకారుడు మిల్కా సింగ్ సతీమణి నిర్మల్ మిల్కా సింగ్(85) ఆదివారం కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె గతంలో డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ వుమెన్(పంజాబ్ ప్రభుత్వం)గా పనిచేశారు. ఇండియన్ వుమెన్స్ నేషనల్ వాలీబాల్ టీం కెప్టెన్‌గా కూడా ఆమె వ్యవహరించారు.

ఛండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్)లో ఆమె చికిత్సను పొందారు. శనివారం కొంత కోలుకున్నారని వైద్యులు భావించగా.. ఆదివారం ఆమె చనిపోవడంతో వారి కుటుంబంలో విషాదం నెలొకంది.

 Legendary Athlete Milkha Singhs Wife Died from coronavirus

కాగా, మిల్కా సింగ్ కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని పీజీఐఎంఈఆర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

జూన్ 3 నుంచి మిల్కా సింగ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటన్నారు. ఆయనకు సీనియర్ వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. కరోనా సోకడంతో 91 ఏళ్ల మిల్కాసింగ్ ఆస్పత్రి చేరారు. ఆక్సిజల్ లెవల్స్ పడిపోవడంతో ఆయనను ఫోర్టిస్ నుంచి పీజీఐఎంఈఆర్‌కు తీసుకొచ్చారు. అప్పట్నుంచి ఆయన ఇక్కడే చికిత్స పొందుతున్నారు.

English summary
Legendary Athlete Milkha Singh's Wife Died from coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X