ఎమ్మెల్యేలు కోతుల్లాగా వ్యవహరిస్తున్నారు.. వారిని కట్టడి చేసేందుకు చెట్లను నాటండీ...
ఎమ్మెల్యేల జంపింగ్లు గోవాను కూడ తాకాయి. అక్కడ ఉన్నకాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళుతున్నారు. దీంతో గోవా డిప్యూటీ సీఎం పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు చెట్లపై కోతులు ఎగురుతున్నట్టు బీజేపీలోకి గిరిపోతున్నారని ఎద్దేవా చేశారు. వారిని కట్టడి చేసేందుకు చెట్లను నాటాలని అటవీ అధికారులను కోరారు.
కాగా గోవాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలకు గాను 10 మంది ఎమ్మెల్యే లు బీజేపీలోకి జంప్ అవుతున్న నేపథ్యంలోనే గోవా డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్ పలు విమర్శలు చేశారు. ఈనేపథ్యంలోనే ఎమ్మెల్యేలు అడవుల్లో కోతులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానకి వెళ్లే సమయంలో చెట్లపై జంప్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన మానవ రూపంలో ఉన్న కోతులు సమాజంలో కలవకుండా ఎక్కువగా చెట్లు నాటాలని ఆయన ఫారెస్ట్ అధికారులు కోరారు. మరోవైపు కాగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. డీప్యూటీ సీఎం పై మండిపడ్డారు.