వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంట్లోకి ప్రవేశించిన చిరుత: బాత్రూమ్లో దాక్కొన్న అత్తా కోడళ్ళు
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. ఉదయం పూటే 8 గంటలకే రంగనాథ్ అనే వ్యక్తి ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది.
చిరుతపులి ఇంట్లోకి రావడంతో అత్త వనజాక్షి, కోడలు వినూత బాత్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రాణ భయంతో గడిపారు. చిరుతపులి ఇంట్లోకి రావడంతో ఆ చిరుతను ఇంట్లో నుండి తప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు.
విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే రఫిక్ అహ్మద్, జిల్లా కలెక్టర్ కెపి మోహన్ రాజు, ఎస్పీ గోపినాథ్ దివ్యఅక్కడకు చేరుకొన్నారు. ఇంటిగోడను పగుల గొట్టి ఆ ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు.
రాత్రి 7 గంటలకు చిరుతను బంధించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు.పడగొట్టిన గోడ నుండి లోపలికి ప్రవేశించి చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. చిరుత మత్తులోకి జారుకొన్న తర్వాత అటవీ ప్రాంతానికి తరలించారు.
Comments
English summary
A young leopard was captured on Saturday amid high drama after it remained trapped for hours in a house in Karnataka's Tumakuru town.
Story first published: Sunday, January 21, 2018, 17:21 [IST]