డబ్బు డ్రా చేసేందుకు వెళ్లగా.. ఏటీఎంలో చిరుతపులి పిల్ల
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లా థంగ్ ప్రాంతంలో ఆదివారం నాడు ఓ చిరుతపులి పిల్ల అటవీ ప్రాంతంలో నుంచి దారి తప్పి జనావాసాల్లోకి వచ్చిది. అది ఓ ఏటీఎం కేంద్రంలో తలదాచుకుంది. డబ్బులు తీసుకోవడానికి వెళ్ళిన వారికి ఏటీఎంలో చిరుతపులి పిల్ల కనిపించింది.
దీంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఆ చిరుతపులి పిల్లను కాపాడి సురక్షితంగా జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
థంగ్ ప్రాంతంలోని ఆ ఏటీఎంలోకి పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లారు. అతను పులి పిల్లను చూసి కేకలు వేస్తూ బయటకు వచ్చారు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. ఏటీఎంలో దూరిన పులిపిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు.
ఆ తర్వా అటవీ శాఖ అధికారులను పిలిచారు. వారితో పాటు ఓ ట్యాక్సీ డ్రైవర్ దానిని బయటకు తీసుకు వచ్చారు. అక్కడ ఉన్న వాహనాన్ని ఎక్కించి అడవిలో వదిలారు. కాగా, చలి కారణంగా ఆ చిరుతపులి పిల్ల ఏటీఎంలో తలదాచుకుందని భావిస్తున్నారు.