ప్రేమించలేదని యువతిని హత్య చేసిన లెస్బియన్
కోల్కత్తా: పశ్చిమ బంగాలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ లెస్బియన్ యువతి మరో యువతిని దారుణంగా పొడిచి చంపింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్లోని రైల్వేకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైల్వే కాలనీలోని ఇళ్లల్లో పాచిపనులు చేసుకునే ఓ యవతిని మరో యువతి ప్రేమించాలంటూ గత కొంతకాలంగా వెంటపడుతోంది. శుక్రవారం ఇదే విషయమై ఆ యువతిపై ఒత్తిడి తీవ్రతరం చేయడంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దీంతో ముందుగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో లెస్బియన్ యువతి బాధిత యువతిని కత్తితో పొడిచింది.
కత్తిపోట్లకు గురై పడి ఉన్న యువతి దేహాన్ని చూసి యజమాని పోలీసులకు సమాచారమందించారు. కత్తిపోట్లతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు చెప్పారు. మృతురాలు తన తల్లి, నలుగురు అన్నలు, అక్కాచెల్లెళ్లతో కలిసి కాలనీకి సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తోంది.
యువతి మృతి వెనుక ఓ లెస్బియన్ హస్తముందని పోలీసులు విచారణలో తేలింది. ప్రేమిస్తున్నానంటూ ఓ యువతి వేధింపులకు పాల్పడింది. లవర్గా ఒప్పుకోమని ఒత్తిడి చేయగా బాధితురాలు తిరస్కరించింది. దాంతో ఆమెను లెస్బియన్ దారుణంగా కత్తితో పొడిచి హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ప్రస్తుతం లెస్బియన్ పరారీలో ఉంది. పోలీసులు అమె కోసం గాలిస్తున్నారు.