14యెళ్ల విచారణ...14యెళ్ల జైలు శిక్ష...అయోధ్య దాడి కేసులో 4గురికి శిక్ష
అయోధ్య రామమందిరం వివాద స్థలం వద్ద జరిగిన కాల్పులు ఘటన జరిగిన నిందితులకు ప్రయాగ్రాజ్ ప్రత్యేక కోర్టు శిక్షలు ఖారారు చేసింది. దాడి జరిగిన 14 సంవత్సరాల తర్వాత నలుగురు నిందితులకు ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారగార శిక్ష విధించింది.ఒకరిని నిర్ధోషిగా విడుదల చేసింది.
జూలై 5 2005న వివాస్పద స్థలం అయినా బాబ్రీ మసీదు వద్ద టెర్రరిస్టులు బాంబుదాడులు తెగబడ్డారు. మొత్తం పదిమంది టెర్రరిస్టులు బాంబులు,రాకేట్ లాంచర్తో వివాదస్పద మందిరంపై దాడి చేశారు. ఈనేపథ్యంలోనే యాత్రికులుగా నమ్మించిన టెర్రరిస్టులు అయోధ్య శివారులోని ఓ జీపును అద్దేకు తీసుకున్నారు. అనంతరం ఆ జీపును బాబ్రీ మసీదు సమీపంలో ఉంచి పేల్చి వేశారు. దీంతోపాటు రాకెట్ లాంచర్ను మందిరంలోకి విసిరారు.
కాగా తీవ్రవాదుల బాంబు దాడిని సీఆర్పీఎఫ్ జవానులు తిప్పికోట్టారు. దాడులు చేసిన ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈనేపథ్యంలోనే 5 టెర్రరిస్టులు ఎదురు కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందగా మరో అయిదుగురిని దర్యాప్తు తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తీవ్రవాదుల్లో నలుగురు కశ్మీరు చెందిన వారు కాగ, మరోకరు యూపిన చెందినవాడు. ఇక అప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవానులు తీవ్రంగా గాయపడగా మొత్తం ఏడుగురు జవానులకు గాయాల భారిన పడ్డారు.