ముంబై మోడల్ హత్య: ఫిల్మ్ ఆర్టిస్ట్కు యావజ్జీవ శిక్ష
హైదరాబాద్/ముంబై: ముంబైకి చెందిన మోడల్ అర్జూ అలీ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం బుధవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అర్జూ హత్య కేసులో రాజేశ్వరయ్య నిందితుడిగా ఉన్నాడు. అతనికి కోర్టు ఈ రోజు యావజ్జీవ కారాగార శిక్షను విధించిందని సమాచారం. రాజేశ్వరయ్య పలు సినిమాల్లోను నటించినట్లుగా తెలుస్తోంది.
ముంబైకి చెందిన మోడల్ అర్జూ అలీ 25 జూలై 2009లో హైదరాబాదులో హత్యకు గురయింది. వివరాల మేరకు నిందితుడు ఆమెను ఓ హోటల్లో హత్య చేశాడు. మోడల్కు 1994లో పెళ్లయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నాడు ఈ మోడల్ వ్యాపారం పని నిమిత్తం 19 జూలై 2009న హైదరాబాదుకు వచ్చింది. అప్పుడు నిందితుడితో పరిచయం ఏర్పడింది. నిందితుడు అర్జూ పట్ల హద్దు మీరే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే 25వ తేదీన ఆమె పైన అతను అత్యాచారయత్నం చేశాడు. ఆమె అరిచే ప్రయత్నం చేయగా.. ఆమె స్కార్ఫ్తో ఆమె గొంతు నులిమి చంపాడు.