20 మంది మృతి: ఉరుములతో మృత్యువాత, వారంలో 100 మంది...
ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం బీహర్లో కురిసింది. మధ్యాహ్నం 1 గంట నుంచి వర్షం కురుస్తూనే ఉంది. పాట్నా సహా మిగతా నగరాల్లో భారీ వర్షం కురుస్తోందని తెలిపింది. ఉరుముల వల్ల బీహర్ రాష్ట్రంలో శనివారం 20 మంది చనిపోయారు. ఆదివారం కూడా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉరుముల వల్ల శుక్రవారం రాష్ట్రంలో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. సమస్తిపూర్ నుంచి ముగ్గురు చనిపోగా.. మిగతా జిల్లాల నుంచి మిగతా వారు చనిపోయారు. అంతకుముందు కూడా ఉరుముల వల్ల 26 మంది చనిపోయారు. వారం రోజుల్లోనే రాష్ట్రంలో 100 మంది చనిపోయారు.
Recommended Video
గతేడాది లానే ఈ సారి కూడా ఉంది అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. గతేడాది చేసిన తప్పిదాల నుంచి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏం నేర్చుకోలేదని చెప్పారు. డ్రైనేజీలు సరిగా లేవు అని.. మ్యాన్ హోళ్ల నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో తేలికపాటి వర్షానికే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు.