వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను నరేంద్ర మోడీలాగే ఆలోచిస్తా..నిర్ణయాలు తీసుకుంటా: రైతులకు ఏటా రూ.2000: యడియూరప్ప

|
Google Oneindia TeluguNews

Recommended Video

మోడీ అడుగు జాడల్లో నడుస్తా : యడియూరప్ప || Karnataka CM BS Yediyurappa Announced Sops For Farm Sector

బెంగళూరు: నేను మా నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలాగే ఆలోచిస్తాను..ఆయనలాగే నిర్ణయాలను తీసుకుంటాను.. అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. నరేంద్ర మోడీ అడుగు జాడల్లో నడుస్తానని చెప్పారు. రైతుల సంక్షేమానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిత్తశుద్ధి వారి ఉన్నతికి కృషి చేస్తామని అన్నారు. 14 నెలల కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను సవరిస్తానని చెప్పారు.

ఏటా రెండు విడతల్లో రూ.2000

సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన పలు అంశాలపై క్లుప్తంగా మాట్లాడారు. ప్రత్యేకించి- రైతు సంక్షేమం గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. నరేంద్ర మోడీ అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ పథకానికి రాష్ట్రంలో అదనపు నిధులను సమకూరుస్తామని చెప్పారు. కేంద్రం అమలు చేస్తోన్న విధానం తరహాలోనే రాష్ట్రంలో రైతుల కోసం సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. రైతులకు ఏటా రెండు విడతల్లో 2000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, యడియూరప్ప చెప్పారు.

‘Like Modi I too have decided...’: Yediyurappa on farm crisis

ప్రతీకార రాజకీయాలు చేయం

కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం తరహాలోనే ప్రతీకార రాజకీయాల జోలికి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. పట్టు విడుపులను తాము ప్రదర్శిస్తామని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం తమ, తమ పార్టీకి ఉందని చెప్పారు. ప్రతీకార రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో దిగబోమని తాను సభకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు యడియూరప్ప. బడుగు, బలహీన, పేద ప్రజల అభ్యున్నతి కోసం కలిసి రావాలని ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో పయనింపజేయడానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు.

English summary
Moving a confidence motion in Karnataka Assembly on Monday, Chief minister BS Yediyurappa announced sops for farm sector saying he was following in the footsteps of Prime Minister Narendra Modi. “Like Modi, I too have decided to give two installments of Rs 2000 to beneficiaries under PM Kisan scheme from the state’s side,” the chief minister said during the floor test that followed the JD(S)-Congress coalition losing a trust vote last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X