ఓట్ల పథకాల కోసం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు: జగన్
తెలుగురాష్ట్రాల్లో నేటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఏప్రిల్ 11న పోలింగ్ నేపథ్యంలో నిబంధనల మేరకు ఇవాళ సాయంత్రం 5గంటలకల్లా నేతలు ప్రచారం ముగించనున్నారు. మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. చివరి కొన్ని గంటల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంతకాలం విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుకున్న రాజకీయపార్టీల నాయకులు ప్రచారం గడువు ముగిసేలోగా వీలైనంత ఎక్కువ మంది ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులో ప్రచారం నిర్వహించనుండగా... వైసీపీ చీఫ్ జగన్ గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో జరగనున్న ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా ఓటర్లతో మమేకంకానున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గడువుకు ఒకరోజు ముందే ప్రచారానికి తెర దించారు. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేవెళ్లలో జరగనున్న పార్టీ బహిరంగసభలో పాల్గొననున్నారు.
Priyanka Gandhi Vadra holds a road show in Saharanpur. #LokSabhaElections2019 pic.twitter.com/kGA97z5sIa
— ANI UP (@ANINewsUP) April 9, 2019