వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓట్ల పథకాల కోసం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు: జగన్

|
Google Oneindia TeluguNews

తెలుగురాష్ట్రాల్లో నేటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఏప్రిల్ 11న పోలింగ్ నేపథ్యంలో నిబంధనల మేరకు ఇవాళ సాయంత్రం 5గంటలకల్లా నేతలు ప్రచారం ముగించనున్నారు. మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. చివరి కొన్ని గంటల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంతకాలం విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుకున్న రాజకీయపార్టీల నాయకులు ప్రచారం గడువు ముగిసేలోగా వీలైనంత ఎక్కువ మంది ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులో ప్రచారం నిర్వహించనుండగా... వైసీపీ చీఫ్ జగన్ గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో జరగనున్న ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా ఓటర్లతో మమేకంకానున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గడువుకు ఒకరోజు ముందే ప్రచారానికి తెర దించారు. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేవెళ్లలో జరగనున్న పార్టీ బహిరంగసభలో పాల్గొననున్నారు.

Live Updates : only Few Hours left for first Phase campaign

Newest First Oldest First
5:20 PM, 9 Apr

అద్దె నాయకులతో చంద్రబాబు ప్రచారం చేయించారు: జగన్
5:11 PM, 9 Apr

కేసీఆర్ హోదా కోసం మద్దతు ఇస్తా అంటే స్వాగతించాల్సిందిపోయి ఆయనపై విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు: జగన్
5:10 PM, 9 Apr

కార్యకర్త కాలర్ ఎగురేసి ఫలానా వ్యక్తి మానాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలి: జగన్
5:10 PM, 9 Apr

ఎక్కడ ఎవరికి సమస్య వచ్చిన ప్రజల తరుపున పోరాడాను,ధర్నాలు చేశాను: జగన్
5:09 PM, 9 Apr

ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు కట్టారు: జగన్
5:09 PM, 9 Apr

నేను చెప్పులు విప్పి కాలినడకన శ్రీవారిని దర్శించుకున్నాను..నేను చెప్పులు వేసుకుని శ్రీవారిని దర్శించుకున్నట్లు పవన్ చెబుతున్నాడు: జగన్
5:08 PM, 9 Apr

ఓట్ల పథకాల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు: జగన్
5:04 PM, 9 Apr

చంద్రబాబుకు కేసీఆర్‌ అంటే సరిపోదు: జగన్
5:04 PM, 9 Apr

తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఒకే తాటిపైకొచ్చి ప్రత్యేక హోదా డిమాండ్ తీసుకొస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి: జగన్
5:03 PM, 9 Apr

ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇస్తారని కేసీఆర్ చెప్పారు: జగన్
5:02 PM, 9 Apr

తిరుపతిలో జగన్ ఎన్నికలు ప్రచారం: చంద్రబాబు రకరకాలుగా అబద్ధాలు చెబుతున్నారు: జగన్
3:23 PM, 9 Apr

కర్నాటకలో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో తెలియడం లేదు. రాజకీయ లబ్ధి కోసం రెండు బలహీనమైన పార్టీలు ఒక్కటయ్యాయి: మోడీ
3:22 PM, 9 Apr

ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ భారత్‌కు మద్దతుగా నిలుస్తుంటే ఇక్కడ మాత్రం మహాగట్భందన్ పార్టీలు పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్నాయి: మోడీ
3:20 PM, 9 Apr

ఎన్నికల తర్వాత ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధంగా ఉన్నాం: మోడీ
3:19 PM, 9 Apr

సహారన్‌పూర్‌లో ప్రియాంకా గాంధీ రోడ్ షో
2:46 PM, 9 Apr

రాహుల్ బాబా , కేసీఆర్ లాంటోళ్లు ఏవో ఫ్రంట్‌లు కట్టాలని చూస్తున్నారు. వాటి వల్ల వారి కుటుంబాలకే ప్రయోజనం ప్రజలకు కాదు : అమిత్‌షా.
2:39 PM, 9 Apr

దేశ ప్రజలంతా మరో సారి మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు : అమిత్‌షా
2:34 PM, 9 Apr

కాశ్మీరుకు ప్రత్యేక ప్రధాని కావాలని నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తున్న డిమాండ్‌ను రాహుల్ గాంధీ సమర్థిస్తారా అని అమీత్‌సా ప్రశ్నించార.
2:32 PM, 9 Apr

దేశం గర్విస్తున్న సర్జికల్ దాడులను కాంగ్రెస్ చులకన చేసి మాట్లాడుతోంది
2:29 PM, 9 Apr

దేశభద్రత విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రశ్నించాలి. పాకిస్థాన్‌ను సమర్థించేలా మాట్లాడుతారా ?
2:27 PM, 9 Apr

16 ఎంపీ స్థానాలు గెలిచి కేసీఆర పీఎం అవుతారా ? రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచి కూడా రెండు నెలల పాటు కేబినెట్ ఏర్పాటు చేసుకోలేకపోయారు.
2:26 PM, 9 Apr

కేసీఆర్ ఎంఐఎం అధినేత ఓవైసీకి భయపడుతున్నారు. లేకపోతే తెలంగాణ విమోచన దినం నిర్వహించే ధైర్యం కేసీఆర్‌కు ఉందా ?
2:22 PM, 9 Apr

తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో చెప్పాలి.
2:20 PM, 9 Apr

చేవెళ్ల బీజేపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా అమిత్‌షా ప్రచారం.
2:19 PM, 9 Apr

తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చివరి ప్రచార సభ. శంషాబాద్‌లో కార్యకర్తలను ఉత్తేజపరచిన షా.
1:25 PM, 9 Apr

ఎంత అణిచివేస్తే అంతగా రెచ్చిపోవాలి:ప్రజలకు చంద్రబాబు పిలుపు
1:24 PM, 9 Apr

ప్రధాని నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి అన్యాయం చేశారు: మోడీ
1:23 PM, 9 Apr

కోడికత్తి పార్టీకి ఓటు వేస్తే మనకు నీళ్లు రావు: చంద్రబాబు
1:17 PM, 9 Apr

వీవీ ప్యాట్‌లు నేనే తెప్పించా: చంద్రబాబు
1:17 PM, 9 Apr

మోడీ షా ఇద్దరూ దొంగలు..జగన్ కేసీఆర్ ఇద్దరూ పెంపుడు కుక్కలు: చంద్రబాబు
READ MORE

English summary
Election campaign on peak for first Phase of elections. only Hours left for First phase campain. in ap tdp chief, cm chandrababu naidu, Ycp chief jagan, jana sena chief pawan kalya busy in election campaign. Trs Chief KCR also Working hard for the victory of party candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X