మోడీ ఉత్కంఠ భరిత ప్రసంగం: ప్రారంభం నుంచి చివరిదాకా పాయింట్ టూ పాయింట్
Recommended Video
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత దేశంను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు ప్రధాని మోడీ. మొత్తం 38 నిమిషాల పాటు మోడీ ప్రసంగం సాగింది. జమ్మూ కశ్మీర్కు విముక్తి కల్పించినట్లు ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో ఇకపై జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. జమ్మూ కశ్మీర్ తాత్కాలికంగా మాత్రమే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందని అది శాశ్వతం కాదని మోడీ పునరుద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్లో ఈద్ వేడుకలు యథావిధిగా కొనసాగుతాయన్న ప్రధాని అక్కడి ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్టికల్ 370తో జమ్మూ కశ్మీర్లో అభివృద్ధి కుంటున పడిందని ఇకపై పరుగులు పెడుతుందని చెప్పారు. జమ్మూ కశ్మీర్కు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రధాని మోడీ... ప్రజలు ఇకపై వారికి నచ్చిన ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని ఆ రాష్ట్రాన్ని టూరిజం హబ్గా తయారు చేస్తామని చెప్పారు. ఇకపై కశ్మీర్లో సుపరిపాలన ఉంటుందని చెప్పారు ప్రధాని. ఇక జమ్మూ కశ్మీర్లో విధుల్లో ఉంటూ దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసులకు జవాన్లకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. అమరులైన జవాన్లు స్వప్నాన్ని నిజం చేసేందుకు పనిచేయాల్సిందిగా మోడీ పిలుపునిచ్చారు.