Lockdown: కదులుతున్న ఏసీ బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్, సెకండ్ షో సినిమా వేశారని?, కోసేయాలి!
నోయిడా/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అతి తక్కువ మంది ప్రయాణికులతో ఏసీ బస్సు దూర ప్రాంతానికి బయలుదేరింది. అదే సమయంలో రాత్రి గమ్యం చేరుకోవడానికి 25 ఏళ్ల వయసు ఉన్న మహిళ ఆ బస్సులో ప్రయాణించింది. ఏసీ బస్సు స్లీపర్ కోచ్ లో అందరూ నిద్రపోయిన తరువాత అర్దరాత్రి ఆమెను కత్తులో బెదిరించిన ముగ్గురు కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు.
స్లీపర్ కోచ్ బస్సులో 10 మందికి పైగా ప్రయాణికులు ఉన్నా ఏదో సెకండ్ షో సినిమా వేశారని చూశారు తప్పా ఆ దారుణాన్ని ఒక్కరు ఆపలేకపోయారు. మహిళతో పాటు నిస్సహాయస్థితిలో ఉన్న ఆమె ఇద్దరు పిల్లల ముందే ఇంత దారుణం జరిగింది. ఢిల్లీ నిర్బయ ఘటన లాగా వేగంగా వెలుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం జరగడంతో ప్రజలు షాక్ కు గురైనారు. ఇలాంటి కామాంధులకు మర్మాంగం కోసేయాలని చాలా మంది మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం!
ఏసీ స్లీపర్ కోచ్ బస్సు
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో గత మూడు నెలలుగా అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు బ్రేక్ పడింది. ఇదే సమయంలో 30 శాతం మంది ప్రయాణికులతో బస్సులు తిప్పడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ ప్రాంతం నుంచి నోయిడాకు ఏసీ స్లీపర్ కోచ్ బస్సు బయలుదేరింది.
ఏసీ బస్సులో 25 ఏళ్ల మహిళ
నోయిడా బయలుదేరిన ఏసీ బస్సులో 25 ఏళ్ల మహిళ ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి బయలుదేరింది. బస్సు చివరి సీట్లలో మహిళ ప్రయాణించింది. ఇదే ఏసీ బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు ఓ బస్సు సిబ్బంది నోయిడాకు ప్రయాణం అయ్యారు. బస్సులో మిగిలిన స్లీపర్ కోచ్ సీట్లలో సాటి ప్రయాణికులు ఉన్నారు.
అందమైన మహిళ భర్త లేడని!
బస్సులో మహిళ మాత్రమే పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నదని, ఆమె భర్త ఆ బస్సులో లేడని బస్సు డ్రైవర్లు గుర్తించారు. బస్సు చాలా దూరం ప్రయాణించే వరకు ఆ డ్రైవర్లు మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి ప్లాన్ వేసుకున్నారు. బస్సు లక్నో దాటి మధురా వైపు వేగంగా వెలుతోంది. అప్పటి వరకు కామాంధులు మహిళ మీద డేగకన్ను వేశారు.
రాత్రి 2 గంటలకు!
అర్దరాత్రి దాటిన తరువాత గురువారం వేకువ జామున 2 గంటల సమయంలో ఓ డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు. మరో డ్రైవర్ తో పాటు బస్సులో ఉన్న మరో సిబ్బంది బస్సు చివరి సీట్లో నిద్రపోతున్న మహిళ దగ్గరకు వెళ్లారు. కేకలు వేస్తే నీ బిడ్డలను చంపేస్తామని కత్తులతో బెదిరించిన కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ సమయంలో అత్యాచారం చేసిన ఓ డ్రైవర్ ముందుకు వెళ్లి డ్రైవర్ సీట్లో కుర్చుని మరో డ్రైవర్ ను మహిళ దగ్గరకు పంపించాడు. తరువాత ఆ డ్రైవర్ ఆ మహిళ మీద అత్యాచారం చేశాడు.
బస్సులో సెకండ్ షో సినిమా వేశారా?
బస్సు వేగంగా లక్నో నుంచి మధురా వెలుతున్న సమయంలో ముగ్గురు కామాంధులు 25 ఏళ్ల మహిళ మీద గ్యాంగ్ రేప్ చేశారు. ఆ సమయంలో బస్సులో సాటి ప్రయాణికులు ఉన్నా ఏదో బస్సులోని టీవీలో సెకండ్ షో సినిమా వేశారాని చూశారు తప్పా ఒక్కడు కూడా ఆ దారుణాన్ని అడ్డుకోలేదని, ఆ మహిళకు సహాయం చెయ్యడానికి ప్రయత్నించలేదని వెలుగు చూసింది.
నోయిడాలో కేసు, ఇద్దరి అరెస్టు
గురువారం బస్సు నోయిడా చేరుకోవడంతో భాదిత మహిళ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇద్దరు బస్సు డ్రైవర్లతో పాటు ఓ బస్సు సిబ్బంది తన మీద సామూహిక అత్యాచారం చేశారని భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే స్లీపర్ కోచ్ బస్సు డ్రైవర్ తో సహ ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
కామాంధులకు కోసేయాలి
ఢిల్లీ నిర్బయ ఘటన లాగా కదులుతున్న బస్సులో మహిళపై ఆమె పిల్లల ముందే గ్యాంగ్ రేప్ చేసిన కామాంధుల మర్మాంగాలు కోసేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళ గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, పరారైన ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని నోయిడా పోలీసు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ లాక్ డౌన్ నియమాల సందర్బంగా అతి తక్కువ మంది ప్రయాణించిన స్లీపర్ కోచ్ బస్సులు గ్యాంగ్ రేప్ జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.