Blackmail: విద్యార్థిని స్నానం చేస్తుంటే నగ్న వీడియోలు, కోరిక తీరుస్తావా ? లేదంటే, టార్చర్, చివరికి
చెన్నై/ వేలూరు: లాక్ డౌన్ సందర్బంగా స్కూల్ మూసివేయడంతో ఇంట్లోనే ఉంటున్న విద్యార్థిని చాలా సంతోషంగా ఉండేది. ఓ రోజు ఇంట్లోని బాత్ రూంలో అమ్మాయి స్నానం చెయ్యడానికి వెళ్లిన విషయం గుర్తించిన ముగ్గురు కామాంధులు అమ్మాయి స్నానం చేస్తున్న సమయంలో స్మార్ట్ ఫోన్ లో నగ్న వీడియోలు తీశారు. తరువాత తమ కోరిక తీర్చాలని, లేదంటే నీ నగ్న వీడియోలు యూట్యూబ్ లో పోస్టు చేస్తామని అమ్మాయిని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టారు. కామాంధుల టార్చర్ తట్టుకోని విద్యార్థిని కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని శరీరం దాదాపుగా కాలిపోవడంతో మృత్యువుతో పోరాడుతున్నది.
అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !
10 తరగతి అమ్మాయి
తమిళనాడులోని వేలూరు (ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా సరిహద్దు)లోని బాగాయం సమీపంలోని చిట్టిపట్టు గ్రామంలో 15 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. బాగాయం ప్రాంతంలోని ఓ స్కూల్ లో ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. లాక్ డౌన్ సందర్బంగా మూడు నెలల నుంచి పాఠశాల మూసివేయడంతో సాటి స్నేహితులతో కలిసి ఇంటి దగ్గరే ఆ అమ్మాయి అడూతుపాడుతూ హాయిగా గడుపుతోంది.
బాత్ రూంలో స్నానం చేస్తుంటే !
బాగాయం ప్రాంతంలోనే నివాసం ఉంటున్న ముగ్గురు యువకులు చాలాకాలంగా అమ్మాయిని లైంగిక వేదింపులకు గురి చేస్తున్నారు. విషయం ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవలు అవుతాయని ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి సైలెంట్ గా ఉంటోంది. ఇటీవల అమ్మాయి స్నానం చెయ్యడానికి బాత్ రూంలోకి వెళ్లింది. చాలా రోజులుగా అమ్మాయి మీద కన్ను వేసిన అదే ప్రాంతంలోని కామాంధులు అమ్మాయి స్నానం చేస్తున్న సమయంలో మొబైల్ లో ఆమె నగ్న వీడియోలు తీశారు.
కోరిక తీరుస్తావా ? లేదా యూట్యూబ్ లో
మూడు రోజుల క్రితం గ్రామంలో ఒంటరిగా వెలుతున్న అమ్మాయిని ఆ ముగ్గురు యువకులు అడ్డగించి ఆమె స్నానం చేస్తున్న సమయంలో తీసిన నగ్న వీడియోలను ఆమెకు చూపించారు. మా కోరిక తీర్చాలని, లేదంటే నీ నగ్న వీడియోలను యూట్యూబ్ లో, ఫేస్ బుక్ లో పోస్టు చేస్తామని, అప్పుడు నీతో పాటు నీ కుటుంబం పరువు మొత్తం బజారులో పడుతోందని ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు.
టార్చర్ పెట్టిన కామాంధులు
కామాంధులు బెదిరించిన రోజు రాత్రి పూర్తిగా నిద్రపోకుండా ఎంత తప్పు చేశాను దేవుడా అంటూ ఆ అమ్మాయి కుమిలిపోయింది. మరుసటి రోజు పనిపై బంధువుల ఇంటికి వెలుతున్న అమ్మాయిని మరోసారి కామాంధులు అడ్డగించి మా ముగ్గురి కోరిక తీర్చాలని మళ్లీ బ్లాక్ మెయిల్ చేస్తూ నరకం చూపించారు. అప్పటి నుంచి ఆ ముగ్గురి వేధింపులు ఎక్కువ అయ్యాయి.
Recommended Video
ఏ జరిగిందంటే ?
కామాంధులు టార్చర్ ఎక్కువ కావడంతో వారి భాదనుంచి తప్పించుకోవాలని ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. శరీరం సుమారు 60 శాతం పైగా కాలిపోవడంతో ఆమెను కుటుంబ సభ్యులు వేలూరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి అమ్మా ఏం జరిగింది ? అంటూ అమ్మాయిని ప్రశ్నించారు. తాను స్నానం చేస్తున్న సమయంలో ముగ్గురు యువకులు నగ్న వీడియోలు తీసి మా కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశారని, అందుకే అత్మహత్య చేసుకోవాలని నిప్పంటించుకున్నానని అమ్మాయి పోలీసులకు చెప్పింది. బాలిక నిప్పంటించుకున్న తరువాత కామాంధులు పారిపోవడంతో వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.