వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ చిరు వ్యాపారాలు,దుకాణాలే కాదు ఫంక్షన్ హాల్స్ కూడా : యూపీ మార్గదర్శకాలు

|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతుంది. ఇక ఈ నేపధ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . ఇక కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనా కట్టడికి అన్ని రాష్టాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా కేంద్రం లాక్ డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చి వాటిపై ఆయా రాష్ట్రాలు స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు . దీంతో ఇక యూపీలో కూడా కరోనా కట్టడి చర్యలు చేపడుతూనే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ .

పాలకుల అసమర్థతకు సాక్ష్యం వలస భారతం: బహు దూరపు బాటసారుల బతుకు దుర్భరంపాలకుల అసమర్థతకు సాక్ష్యం వలస భారతం: బహు దూరపు బాటసారుల బతుకు దుర్భరం

లాక్‌డౌన్ 4.0 మే 31 వరకు పొడిగించిన యూపీ సర్కార్

లాక్‌డౌన్ 4.0 మే 31 వరకు పొడిగించిన యూపీ సర్కార్

కరోనావైరస్ (కోవిడ్ -19) వ్యాప్తిని అరికట్టటానికి ప్రస్తుతం పొడిగించిన లాక్‌డౌన్ 4.0 మే 31 వరకు కొనసాగనుంది . ఇక దీని కోసం కొన్ని లాక్ డౌన్ సడలింపులు , కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది యూపీ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్స్ లో తప్ప మిగతా ప్రాంతాలలో కార్యకలాపాలను అనుమతించడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు అధికారాలను ఇచ్చింది. లాక్డౌన్ 4.0 సమయంలో యుపిలో అనుమతించబడిన మరియు నిషేధించబడిన కార్యకలాపాల జాబితా చూస్తే ఉదయం 4 నుంచి ఉదయం 7 గంటల వరకు మూడు గంటల పాటు సరైన జాగ్రత్తలతో కూరగాయల మార్కెట్లను (సబ్జీ మండి) తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

లాక్ డౌన్ నిబంధనల సడలింపు మార్గదర్శకాలు విడుదల చేసిన యూపీ

లాక్ డౌన్ నిబంధనల సడలింపు మార్గదర్శకాలు విడుదల చేసిన యూపీ

రిటైల్ కూరగాయలను ఉదయం 6 నుండి 9 గంటల మధ్య అమ్మవచ్చునని పేర్కొంది. రాత్రి సమయంలో రాష్ట్రంలో నిషేధిత ఉత్తర్వులు అమల్లో ఉంటాయి మరియు అవసరమైన సేవలు తప్ప, రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల మధ్య ఎటువంటి వాహనాలను కూడా అనుమతించరు.ఇక కొన్ని పరిమితులతో ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతించారు. డ్రైవర్‌తో సహా ముగ్గురు ప్రయాణీకులు నాలుగు చక్రాల మీద ప్రయాణించవచ్చు, ద్విచక్ర వాహనాలపై ఇద్దరు ప్రయాణం ఒక మహిళల విషయంలో మాత్రమే అనుమతించబడింది మరియు త్రీ వీలర్‌లో డ్రైవర్‌తో సహా ముగ్గురికి అనుమతి ఉంది.

చిరు వ్యాపారాలు, రెస్టారెంట్లు , ఫంక్షన్ హాల్స్ కు అనుమతి . కండీషన్స్ అప్లై

చిరు వ్యాపారాలు, రెస్టారెంట్లు , ఫంక్షన్ హాల్స్ కు అనుమతి . కండీషన్స్ అప్లై

వీధి వ్యాపారులు మరియు హాకర్లు కూడా రాష్ట్రంలో తమ పని చేసుకోవచు . రెస్టారెంట్లు పనిచేయడానికి అనుమతించబడ్డాయి కాని హోమ్ డెలివరీ మాత్రమే చెయ్యాల్సి ఉంటుంది. బాంకెట్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ తెరవడానికి అనుమతి ఇచ్చారు కానీ 20 మందికి పైగా వివాహానికి హాజరు కావటానికి వీల్లేదని పేర్కొంది. కేంద్రం సూచించినట్లు ఎక్కువ మంది గుంపులుగా లేకుండా స్టేడియంలను తిరిగి తెరవడానికి అనుమతి ఉంది. కొత్త మార్గదర్శకాలలో ప్రింటింగ్ ప్రెస్‌లు, డ్రై క్లీనర్‌లు, కంటైనేషన్ జోన్‌ల వెలుపల పారిశ్రామిక కార్యకలాపాలు మరియు స్వీట్ షాపులు కూడా అనుమతించబడ్డాయి. ఇక నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ ఆస్పత్రులు అత్యవసర ఆపరేషన్లకు కూడా అనుమతి ఇచ్చింది .

స్కూళ్ళు , కాలేజీలు , సమావేశాలు ,థియేటర్లు ,జిమ్స్ కు నో

స్కూళ్ళు , కాలేజీలు , సమావేశాలు ,థియేటర్లు ,జిమ్స్ కు నో

లాక్డౌన్ 4.0 సమయంలో పాఠశాల, కళాశాలలు మరియు అన్ని ఇతర విద్యాసంస్థలు మూసివేయబడతాయి. ఇంకా వాటికి వెసులుబాటు ఇవ్వలేదు . తాజా మార్గదర్శకాలలో మతపరమైన సమావేశాలు నిషేధించబడ్డాయి.అత్యవసర , ఎయిర్ అంబులెన్స్ మినహా విమాన సేవలు రాష్ట్రంలో లాక్డౌన్ కాలంలో పనిచేయడానికి అనుమతించబడవు. లాక్డౌన్ యొక్క నాల్గవ దశలో మెట్రో సేవలు కూడా కొనసాగవు . లాక్డౌన్ 4.0 సమయంలో సినిమా హాళ్ళు, మాల్స్ మరియు జిమ్‌లకు కూడా వెసులుబాటు లేదు.

English summary
Uttar Pradesh has extended the ongoing lockdown to check the spread of the coronavirus disease (Covid-19) till May 31 and issued new guidelines for lockdown 4.0.The Union ministry of home affairs (MHA) has given powers to states and Union territories to decide green, orange and red zones and allow activities in these areas except in containment zones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X