Lockdown: రివర్స్ గేర్, 16 ఏళ్ల బాలుడి కిడ్నాప్, రేప్ కేసు, ఆంటీ అరెస్టు, పోస్కో కేసుతో కామాంధురాలు
చెన్నై/ రామనాథపురం: ఇంటి దగ్గర ఆడుకోవడానికి వచ్చి వెలుతున్న బాలుడి మీద వివాహిత మహిళ కన్ను పడింది. 10తో తరగతి బాలుడు వివాహిత మహిళ ఇంటికి వచ్చి వెలుతుంటే వారి కుటుంబ సభ్యులతో పాటు ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అయితే బాలుడిని వలలో వేసుకున్న వయ్యారిభామ చివరికి అందరి కొంపముంచింది. వారం రోజుల క్రితం బాలుడిని పిలుచుకుని వివాహిత మహిళ జెండా ఎత్తేసింది. బాలుడు కనపడకపోవడం, అదే రోజు నుంచి వివాహిత మహిళ కనపడకపోవడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.
Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త
10వ తరగతి బాలుడు
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని కముది సమీపంలోని కీలకలతూర్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలుడు నివాసం ఉంటున్నాడు. ఈ బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. బాలుడు నివాసం ఉంటున్న కీలకలతూర్ ప్రాంతంలోనే 24 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. బాలుడి ఇంటి సమీపంలో ఉంటున్న ఆ మహిళకు వివాహం అయ్యింది.
ఆంటీ బాగున్నారా !
లాక్ డౌన్ సందర్బంగా స్కూల్ మూసివేయడంతో బాలుడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్న మహిళ ఇంటికి బాలుడు వెళ్లి ఆంటీ బాగున్నారా ?, ఏం చేస్తున్నారు ? అంటూ ఆమెను పలకరిస్తున్నాడు తరువాత ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సాటి పిల్లలతో కలిసి ఆ బాలుడు ఆట్లాడుకుంటున్నాడు. ఇంటికి వచ్చి వెలుతున్న బాలుడి మీద వివాహిత మహిళ కన్ను పడింది.
బాలుడికి కామాంధురాలి వల
16 ఏళ్ల బాలుడు ఇంటికి వచ్చి వెలుతుంటే ఆమె కుటుంబ సభ్యులు ఏమీ మాట్లాడలేదు. మహిళ ఇంటికి వెలుతున్న బాలుడి కుటుంబ సభ్యులు అందుకు అభ్యంతరం చెప్పలేదు. ఏదో పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి వెలుతున్న బాలుడు పరిచయం ఉన్న మహిళతో మాట్లాడుతున్నాడని, అతనికి అలాంటి చెడు ఉద్దేశాలు ఉండే వయసులేదని అందరూ అనుకున్నారు. అయితే కామాంధురాలైన వివాహిత మహిళ బాలుడికి వలవేసింది.
ఏం జరిగిందో తెలీదు కాని !
వివాహిత
మహిళతో
ఎక్కువ
చనువుగా
ఉంటున్న
బాలుడు
ఆమె
మాయలో
పడిపోయాడు.
లోపలలోపల
ఏం
జరిగిందో
కాని
ఆ
బాలుడు
ప్రతిరోజు
ఎక్కువ
సమయం
ఆమె
ఇంటిలో
గడపడం
మొదలుపెట్టారు.
ఇంట్లో
ఎవ్వరూ
లేనిసమయంలో
బాలుడితో
వివాహిత
మహిళ
తనకామం
తీర్చుకుందని
తెలిసింది.
మంచి ముహూర్తం చూసి ఎస్కేప్
మహిళ మాయలో పడిపోయిన బాలుడు ఎప్పటిలాగే ఈనెల 5వ తేదీన వివాహిత మహిళ ఇంటికి వెళ్లాడు. రాత్రి అయినా బాలుడు ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో వెతికారు. అయితే బంధువులు, తెలిసిన వారి ఇంటిలో లేడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కముది పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
Recommended Video
వామ్మో కిలాడీ లేడీ, పోక్స్ చట్టం కేసు
బాలుడు మాయం అయిన అదే రోజు బాలుడితో చనువుగా ఉంటున్న వివాహిత మహిళ మాయం అయ్యిందని వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు. అప్పటి నుంచి వివాహిత మహిళ, బాలుడి కోసం వారి కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. రామనాథపురం పట్టణం సమీపంలోని పార్తీపనూరులోని ఓ ఇంటిలో వివాహిత మహిళ, బాలుడు గుట్టుగా ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. నేరుగా అర్దరాత్రి ఇంటికి వెళ్లిన పోలీసులు మహిళను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. బాలుడికి వైద్య పరీక్షలు చేయించి అతని తల్లిదండ్రులకు అప్పగించామని, మహిళ మీద నమోదు చేసిన కిడ్నాప్, రేప్ కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.