Lockdown: నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్టు, కథ వెనుక నర్సు లవ్ స్టోరీ, పోలీసులకు సూపర్ సినిమా !
చెన్నై/ మదురై: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు తమిళనాడు విలవిలలాడిపోతుంది. ఇప్పటికే లాక్ డౌన్ సడలింపులను కఠినం చేసిన తమిళనాడు సర్కార్ కరోనా కట్టడికి అనేక ఆంక్షలు విధించింది. లాక్ డౌన్ నియమాలను తుంగలోతొక్కి హల్ చల్ చేస్తున్న ఓ యువకుడు పోలీసు అధికారులకు చుక్కలు చూపించాడు. చెక్ పోస్టులో తాను ఐఏఎస్ అధికారి అంటూ కారులో దర్జాగా వెళ్లిపోయాడు. ఐఏఎస్ అధికారి ముసుగులో పోలీసు అధికారులకు సూపర్ సినిమా చూపించిన యువకుడి కథ వెనుక ఓ నర్సు ఉందని తెలుసుకున్న అధికారులు షాక్ కు గురైనారు. నిజమైన ఐఏఎస్ అధికారి ఎంట్రీతో సినిమా స్టోరీ రసవత్తరంగా మారిపోయింది.
Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త
సీఎం పళనిస్వామి ఆదేశం
తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పెరిగిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కఠిన ఆంక్షలు అమలు చేశారు. లాక్ డౌన్ సడలింపులు పూర్తిగా బంద్ చేసి మళ్లీ చెన్నైతో పాటు అనేక జిల్లాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారు. ఎవ్వరూ అనవసరంగా సంచరించకూడదని, అత్యవసరం అయితే అధికారుల దగ్గర ఈ - పాస్ లు తీసుకుని సంచరాలించాలని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రజలకు మనవి చేశారు.
చెక్ పోస్టులో నకిలీ ఐఏఎస్ అధికారి
తమిళనాడులోని మదురై విలాన్ గుడి చెక్ పోస్టు దగ్గర పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ఈ- పాస్ లు లేకుండా ఎవరైనా సంచరిస్తున్నారా ? అంటూ అన్ని వాహనాలు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ లోగో ఉన్న కారులో ఓ యువకుడు చెక్ పోస్టు దగ్గరకు వెళ్లాడు. తాను కొడైకెనాల్ సమీపంలోని పుదుపుత్తూరు ప్రాంతానికి చెందిన వేల్ మణి (27) అని అక్కడ ఉన్న పోలీసులు, రెవెన్యూఅధికారులను పరిచయం చేసుకున్నాడు.
నేను ఎవరనుకున్నారు ?
పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులతో ఐఏఎస్ అధికారి అని పరిచయం చేసుకున్న యువకుడి దగ్గర అసలు ఈ- పాస్ లేదు. నేను ఎవరనుకుంటున్నారు ? ఐఏఎస్ అధికారి, తన పేరు వేల్ మణి అని పోలీసు అధికారులకు గట్టిగా చెప్పాడు. ఐఏఎస్ అధికారితో ఎందుకు పెట్టుకోవాలి ? ఐఏఎస్ అధికారులకు ఈ- పాస్ అవసరం లేదు అనుకున్న పోలీసు అధికారులు వేల్ మణి మధురై వెళ్లడానికి అవకాశం కల్పించారు.
సార్ ఎవరైనా ఉన్నారా ?
వేల్ మణి అనే ఐఏఎస్ అధికారి మదురై వచ్చాడని చెక్ పోస్టులో ఉన్న పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు మదురై జిల్లా కలెక్టర్ వినయ్ కు సమాచారం ఇచ్చారు. మదురై జిల్లా కలెక్టర్ విచారణలో అసలు వేల్ మణి అనే వ్యక్తి పేరుతో ఎవ్వరూ ఐఏఎస్ అధికారి లేరని, అసలు ఆ పేరుతో ఎవ్వరు ఐఏఎస్ శిక్షణ కూడా తీసుకోలేదని వెలుగు చూసింది. వెంటనే నకిలీ ఐఏఎస్ అధికారి వేల్ మణిని అరెస్టు చెయ్యాలని మదురై జిల్లా కలెక్టర్ వినయ్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నకిలీ ఐఏఎస్ వెనుక నర్సు
పోలీసుల విచారణలో నకిలీ ఐఏఎస్ అధికారి గురించి దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వేల్ మణి ఎంఏ చదివాడని వెలుగు చూసింది. పళనికి చెందిన ఓ నర్సును తాను ఐఏఎస్ అధికారి అని నమ్మించి ప్రేమించిన వేల్ మణి గత నెలలో రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నాడని వెలుగు చూసింది. తరువాత తిరుచ్చి కలెక్టర్ కార్యాలయం దగ్గర హంగామా చేసి అక్కడ ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించే అధికారిగా నాటకం ఆడాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
Recommended Video
గ్రాండ్ రిసెప్షన్ కోసం
నర్సుతో పెళ్లి చేసుకున్న వేల్ మణి వివాహ రిసెప్షన్ కు ఆహ్వాన పత్రికలు పంచిపెట్టడానికి నకిలీ ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తాడని, ఇతను ఐఏఎస్ అధికారి అంటూ కారులో సంచరిస్తున్నాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ముందు జాగ్రత్తగా ఇతను ఇంకా ఎంతమందిని ఇలా నకిలీ ఐఏఎస్ అధికారి అంటూ ఎంత మందిని మోసం చేశాడు ? అంటూ వేల్ మణిని విచారణ చేసి వివరాలు బయటకు లాగుతున్నామని మదురై పోలీసు అధికారులు తెలిపారు.