Boyfriend: ఆంటీ బలంగా ఉంది, బంగారం, డబ్బు ఉంది, గాలం వేశాడు, తేడా, అక్కడే పొడిచి!
చెన్నై: కుటుంబ గొడవల కారణంగా భర్తను గాలికి వదిలేసిన భార్య వేరుగా కాపురం ఉంటున్నది. లైడీస్ టైలర్ అయిన ఆంటీతో ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆంటీ దగ్గర భారీ మొత్తంలో డబ్బులు, బంగారు నగలు ఉన్నాయి. ఇద్దరు పిల్లల తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడి మద్య తేడా వచ్చింది. తనతో కాకుండా మరో వ్యక్తితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావని ఆ యువకుడు గొడవ పెట్టుకున్నాడు. ఇదే విషయంలో గొడవ పెరిగి పెద్దది కావడంతో ఆమె షాపులోనే అందరూ చూస్తున్న సమయంలో ఆ యువకుడు ప్రియురాలిని కత్తెరతో పొడిచి అక్కడికక్కడే పోడిచి చంపేశాడు.
Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త
భర్తను గాలికి వదిలేసిన ఆంటీ
చెన్నై సమీపంలోని తాంబరం సమీపంలోని వండలూరు విఘ్నేశ్వర నగర్ యోగం బాల్ వీధిలో గోపి (55), యశోధ రాణి (48) దంపతులు నివాసం ఉండేవారు. గోపి, యశోధా రాణి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యశోధా రాణి లేడీస్ టైలర్ గా పని చేసే బాగా డబ్బులు సంపాదిస్తున్నది. యశోధా వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న భర్త గోపి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం గొడవ పెద్దది కావడంతో భర్త గోపిని గాలికి వదిలేసిన యశోధా రాణి కుమార్తె, కొడుకును పిలుచుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఆంటీ లక్కీషాప్
తాంబరంలోని పుదు పేరుంగుత్తూర్ భారత్ నగర్ మెయిన్ రోడ్డులో యశోధా రాణి టైలర్ షాపు నిర్వహిస్తోంది. యశోధా రాణికి లక్కీషాపు అయ్యింది. అక్కడే యశోధా రాణి విచ్చలవిడిగా డబ్బులు సంపాధిస్తోంది. యశోధా రాణి దగ్గర ఎక్కువ బంగారు నగలు ఉన్నాయి. యశోధా రాణి టైలర్ షాపుకు అనేక మంది మహిళలతో పాటు వారి భర్తలు వచ్చి వెలుతున్నారు.
ఆంటీకి యువకుడి వల
తాంబరం ప్రాంతంలోని మోతీలాల్ నగర్ వెటై కన్నాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సెల్వకుమార్ (38) అనే యువకుడు లేడీస్ టైలర్ యశోధా రాణికి పరిచయం అయ్యాడు. యశోధా రాణి భర్తకు దూరంగా ఉంటున్నదని తెలుసుకున్న సెల్వకుమార్ ఆమెకు దగ్గర అయ్యాడు. ఇదే సమయంలో సెల్వకుమార్ కు వల వేసిన యశోధా రాణి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఆంటీతో తేడా వచ్చింది
యశోధా రాణి తనతో కాకుండా వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఇటీవల కాలంలో సెల్వకుమార్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో యశోధా రాణి, సెల్వకుమార్ మద్య గొడవలు మొదలైనాయి. వారు నా షాపుకు వచ్చి వెళ్లే వారి భర్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇంతకాలం యశోధా రాణి ఆమె ప్రియుడు సెల్వకుమార్ కు చెబుతూ వచ్చింది. అయినా సెల్వకుమార్ కు యశోధా రాణి మీద అనుమానం మాత్రం తగ్గలేదు.
టైలరింగ్ కత్తెరతో స్పాట్ లో పొడిచాడు
మద్యాహ్నం షాపులో పని మీద యశోధా రాణి బిజీబిజీగా ఉంది. ఆ సమయంలో ప్రియురాలు యశోధా రాణి టైలర్ షాపులోకి వెళ్లిన సెల్వకుమార్ తనతో తప్ప మరెవ్వరితో నువ్వు మాట్లాడకూడదని ఆమెను హెచ్చరించాడు. అక్కడ ఇద్దరి మద్య మాటామాటా పెరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన సెల్వకుమార్ లేడీస్ టైలర్ షాపులో ఉన్న కత్తెర తీసుకుని ప్రియురాలు యశోధా రాణి గొంతులో కసకస అంటూ నాలుగు సార్లు పోడిచాడు. యశోధా రాణి పీక తెగిపోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. యశోధా రాణిని హత్య చేసిన సెల్వకుమార్ అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని తాంబరం పోలీసులు తెలిపారు.