Lockdown: ఒకే ఆఫీసులో ఉద్యోగం, ప్రేమికులను కట్టేసి గ్యాంగ్ రేప్, నిలువు దోపిడి, బ్లాక్ మెయిల్ !
చెన్నై/ తిరుచ్చి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ అమలు కావడంతో అన్ని ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకోవడంతో లాక్ డౌన్ దెబ్బకు కలుసుకోలేకపోయారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కార్యాలయాలు ప్రారంభం కావడంతో ప్రేమికులు కలుసుకున్నారు. ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలో కామాంధులు వారిని చుట్టుముట్టి కట్టేసి చితకబాదేశారు. ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు ప్రేమికుల దగ్గర ఉన్న రూ. లక్షల విలువైన బంగారు నగలు, నగదు లూటీ చేశారు. విషయం పోలీసులకు చెబితే గ్యాంగ్ రేప్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు, మీరు రహస్యంగా ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని కామాంధులు బ్లాక్ మెయిల్ చేశారు.
lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !
ఒకే కంపెనీలో ఉద్యోగం
తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలోని విరాలిమలై ప్రాంతంలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో 23 ఏళ్ల యువతి, 24 ఏళ్ల యువకుడు ఉద్యోగం చేస్తున్నారు. యువతి, యువకుడు విరాలిమలై ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారు. ఇద్దరు ఒకే ఊరి వారు కావడం, ఒకే కంపెనీలో ఉద్యోగం చెయ్యడంతో వీరు దగ్గర అయ్యారు. ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
లాక్ డౌన్ దెబ్బతో దూరం !
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు యువతి, యువకుడు పని చేస్తున్న కంపెనీని తాత్కాలికంగా మూసి వెయ్యడంతో ప్రేమికులు కలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇటీవల వీరు పని చేస్తున్న కార్యాలయం తలుపులు తెరుచుకున్నాయి. ఉద్యోగానికి వెలుతున్న యువతి, యువకుడు ఆఫీసు పూర్తి అయిన తరువాత బైక్ లో ఎవ్వరు లేని ప్రాంతానికి వెళ్లి ఏకాంతంగా గడపడం మొదలుపెట్టారు.
ఏకాంతంగా ఉంటే ?
గత నెల 25వ తేదీన సాయంత్రం ఆఫీసు పూర్తి అయిన తరువాత ప్రేమికులు బైక్ లో వారు నిత్యం ఏకాంతంగా గడిపే ప్రాంతానికి బయలుదేరారు. తిరుచ్చి రోడ్డులోని మణికందం ప్రాంతంలోని రోరికంలో ఎప్పుడూ కలుసుకునే ప్రాంతంలో ఓ చోట బైక్ పార్క్ చేసిన ప్రేమికులు తరువాత అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లి ఏకాంతంగా గడపడం మొదలుపెట్టారు. అప్పటికే చీకటి పడిపోయింది. ఆ సమయంలో చీకటిలో కొందరు యువకులు ప్రేమికులను చుట్టుముట్టారు.
ప్రేమికులను కట్టేసి దాడి, గ్యాంగ్ రేప్
ప్రేమికులు ఏకాంతంగా కలుసుకుంటున్న సమయంలో అప్పటికే వీడియో తీసిన యువకులు వారిని కట్టేసి చితకబాదేశారు. ప్రియుడిని దూరంగా కట్టేసిన యువకులు వారు ఏకాంతంగా కలుసుకునే సమయంలో తీసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని యువతిని బెదిరించారు. తరువాత యువతిపై కామాంధులు వరుసుగా గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేస్తున్న సమయంలో ఆ నీచులు మొబైల్ లో చిత్రీకరించారు.
ప్రేమికుల నిలువు దోపిడి, బ్లాక్ మెయిల్
ప్రేమికులపై దాడి చేసి యువతిపై గ్యాంగ్ రేప్ చేసి వీడియోలు తీసిన కామాంధులు అక్కడితే వారిని వదిలిపెట్టలేదు. యువకుడి దగ్గర ఉన్న బంగారు గొలుసు, డబ్బులు, మొబైల్ లాక్కొన్నారు. తరువాత యువతిని బెదిరించి ఆమె దగ్గర ఉన్న రెండున్న తులాల విలువైన కమ్మలు, బంగారు గొలుసులు, వెండి పట్టీలు, ఉంగరాలు, మొబైల్ లాక్కొన్నారు. ఈ విషయం బయటకు తెలిస్తే మీరు ఏకాంతంగా కలుసుకునే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించిన నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.
ధైర్యం చేసిన ప్రేమికులు
కామంధులు చేతిలో తాము ఏకాంతంగా తీసుకున్న వీడియోలు ఉండటంతో ఎప్పటికైనా వాటి వలన సమస్యలు వస్తాయని ప్రేమికులు ఆందోళన చెందారు. అంతే కాకుండా నగలు, నగదు లూటీ చెయ్యడంతో నాలుగు రోజులు ప్రేమికులు ఆందోళన చెందారు. తరువాత స్నేహితుల సహాయంతో ధైర్యం చేసిన ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతిపై గ్యాంగ్ రేప్ చేసి వారిని నిలువు దోపిడీ చేసిన గ్యాంగ్ లోని హేమరాజ్ (28), నందకుమార్ (20), మురుగన్ (22) అనే నిందితులను అరెస్టు చేసి బెండ్ ఎత్తేశారు. యువతికి వైద్యపరీక్షలు చేయించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.