వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాసలీలలకు రాత్రికి రమ్మని చెప్పిన తిలకవతి, ఏదో చెయ్యమంటే... రాడ్ తో రాక్షసుడు, ఆమె భర్త, ఇతని భార్య!

|
Google Oneindia TeluguNews

కోయంబత్తూరు/ చెన్నై: మహిళకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చికెన్ సెంటర్ లో భారీగా డబ్బులు సంపాధిస్తున్న వ్యక్తికి పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ భర్తను వదిలేసి ఒంటరిగా నివాసం ఉంటున్నది. చికెన్ షాప్ కు వెళ్లి వస్తున్న ఆమె ఆ షాపు యజమానిని తగులుకుంది. ఇలా వారి రాసలీలలు ఫ్రెండ్స్ అడ్డాకు మారిపోయాయి. భర్త చెంఢాలం చూడలేక చికెన్ షాప్ యజమాని భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. రాసలీలలకు రాత్రి రమ్మని ప్రియురాలు ఫోన్ చేసిన తరువాత ఓ విషయంలో తేడా రావడంతో ప్రియుడు ఇనుప రాడ్ తీసుకుని ముందుగా ప్లాన్ ప్రకారం ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి తరువాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

వయ్యారిభామ తిలకవతి

వయ్యారిభామ తిలకవతి

తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై)లోని కాలవట్టి నెహ్రూనగర్ లో తిలకవతి (33) అనే మహిళ భర్త, ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నది. అయితే ప్రతినిత్యం తిలకవతికి ఆమె భర్తతో గొడవలు జరుతున్నాయి. తిలకవతి తిక్క చేష్టలు, ఆమె నడవడిక, పరాయి పురుషులతో చనువుగా ఉండటం చూసి తట్టుకోలేని ఆమె భర్త వేరుగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇద్దరు కుమారులతో కలిసి తిలకవతి వేరుగా కాపురం ఉంటోంది.

సూపర్ చికెన్ సెంటర్

సూపర్ చికెన్ సెంటర్


కోయంబత్తూరులోని నెహ్రూనగర్ లో పద్మనాభం (37) అనే వ్యక్తి చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు వ్యాపారం జోరుగా సాగడంతో పద్మనాభం దిక్కులేనంత డబ్బులు సంపాధిస్తున్నాడు. పద్మనాభంకు ఇంతకు ముందే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్యాపీగా డబ్బులు సంపాధిస్తున్న పద్మనాభం భార్య, పిల్లలతో కలిసి కొన్ని నెలల వరకు చాలా సంతోషంగానే ఉండేవాడు.

చిన్న టచ్ తో తగులుకున్నారు

చిన్న టచ్ తో తగులుకున్నారు

చికెన్ సెంటర్ కు వచ్చి వెలుతున్న తిలకవతితో ఆ షాపు యజమాని పద్మనాభంకు పరిచయం అయ్యింది. తరువాత తిలకవతి, పద్మనాభం పరిచయం చనువుగా మారింది. భర్తను వదిలిసిన వయ్యారిభామ తిలకవతి డబ్బులు బాగా సంపాధిస్తున్న పద్మనాభంకు వలవేసింది. అంతే అప్పటి నుంచి తిలకవతి, పద్మనాభం ఇద్దరు రాసలీలలు సాగించడంతో తగులుకున్నారు.

చంఢాలం చూడలేక జెండా ఎత్తేసిన భార్య

చంఢాలం చూడలేక జెండా ఎత్తేసిన భార్య


పద్మనాభం ప్రతినిత్యం అక్రమంగా రాసలీలలు సాగించడానికి ప్రియురాలు తిలకవతి ఇంటికి వెళ్లివచ్చే వాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య పద్మనాభంను నిలదీసింది. నా ఇష్టం వచ్చిన వాళ్లతో తిరుగుతాను, నీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఉండు లేకపోతే వెళ్లిపో అని పద్మనాభం తేల్చి చెప్పాడు. భర్త పద్మనాభం చంఢాలం చూడలేని అతని భార్య ఇద్దరు పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

 రాసలీలల కోసం లాక్ డౌన్ గెస్ట్ హౌస్

రాసలీలల కోసం లాక్ డౌన్ గెస్ట్ హౌస్


కరోనా వైరస్ అరికట్టడానికి లాక్ డౌన్ విధించడంతో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు, కార్మికుల కోసం తమిళనాడు ప్రభుత్వం
కోవై సమీపంలో తాత్కాలిక షెడ్లు నిర్మించింది. షెడ్ లు ఖాళీగా ఉండటంతో పద్మనాభం బేవర్సా గ్యాంగ్ అక్కడ రోజు పేకాట, క్యారెమ్స్ ఆడుతున్నారు. తిలకవతి, పద్మనాభం రాసలీలలు సాగించడానికి రాత్రిపూట ఇంట్లో పిల్లలు అడ్డంగా ఉండటంతో వారు ఆ షెడ్లలోకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని తిలకవతి కొంత కాలంగా పద్మనాభం మీద ఒత్తిడి చేస్తూ వస్తోంది. అయితే తెలివైన పద్మనాభం తిలకవతితో ఎంజాయ్ చేస్తూ పెళ్లి మాత్రం చేసుకోకుండా ఈ రోజు రేపు అంటూ కాలం గడుపుతున్నాడు.

రాత్రికి రమ్మంటే వెళ్లి !

రాత్రికి రమ్మంటే వెళ్లి !

రాత్రి ఫోన్ చేసిన తిలకవతి మనం రోజు కలుసుకునే షెడ్ దగ్గరకు రావాలని చెప్పింది. ఆ రోజు రాత్రి వెళ్లిన పద్మనాభం తిలకవతితో ఎంజాయ్ చేశాడు. తరువాత ఇద్దరి మద్య పెళ్లి విషయంలొ గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన పద్మనాభం ముందుగా ఆ షెడ్ లో దాచిపెట్టుకున్న ఇనుప రాడ్ తీసుకుని తిలకవతి తలపై చితకబాదేశాడు. తలకు తీవ్రగాయాలైన తిలకవతి అక్కడికక్కడే మరణించింది.

తల్లి చేసిన పనికి పిల్లలు ?

తల్లి చేసిన పనికి పిల్లలు ?

పోలీసులకు తెలిస్తే తనను జైలుకు పంపిస్తారనే భయంతో ఆందోళనకు గురైన పద్మనాభం అదే షెడ్ లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం షెడ్ దగ్గర తిలకవతి, పద్మనాభం శవాలు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగు చూసింది. తిలకవతి హత్యకు గురి కావడం, తండ్రి దూరం కావడంతో ఆమె ఇద్దరు పిల్లలు ఇప్పుడు రోడ్డున పడ్డారు.

English summary
Lockdown murder: Man suicide after killed his girl friend near Coimbatore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X