lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!
చెన్నై: తన ఫ్రెండ్ తో కన్నతల్లి బెడ్ రూంలో రాసలీలలు సాగిస్తుందని, అతనితో అక్రమ సంబంధం సాగిస్తుందని తెలుసుకున్న కొడుకు కుములిపోయాడు. ఇంటి పరువు పోతుందని, నువ్వు పద్దతి మార్చుకోవాలని తల్లికి అనేకసార్లు చెప్పాడు. తల్లి పద్దతి మార్చుకోకపోవడంతో కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయి కొంతకాలం వేరే ప్రాంతంలో జీవనం సాగించాడు.
అయినా తల్లి మాత్రం ఆమె పద్దతి మార్చుకోకపోవడం, కొడుకు మాటలు ఏమాత్రం పట్టించుకోకపోవడం, స్నేహితులు కొందరు మీ తల్లి ఏం చేస్తుందో తెలుసా ? అంటూ ఎగతాలి చెయ్యడంతో కొడుకు రగిలిపోయాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి పక్కాప్లాన్ ప్రకారం లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో తల్లి ప్రియుడికి పీకలదాక మద్యం తాగించి దారుణంగా హత్య చేసి మర్మాంగం కత్తిరించి తీసుకెళ్లిపోయారు.
100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!
వయసులో తేడా అయినా ఫ్రెండ్స్!
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని మలయంబాక్కంలోని రంజిత్ కుమార్ (30) డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న విమల్ (22), ప్రేమ్ (20), 17 ఏళ్ల బాలుడు స్నేహితులు. వయసులో తేడా ఉన్నా ఈ నలుగురు మంచి స్నేహితులుగా ఉంటున్నారు.
స్నేహితుడి తల్లితో లింక్
మలయంబాక్కంలోనే విమల్, డ్రైవర్ రంజిత్ కుమార్ నివాసం ఉండటంతో ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి వచ్చేవారు. ఆ సమయంలో విమల్ ఇంటికి వెళ్లి వస్తున్న రంజిత్ కుమార్ అతని తల్లి రంజిత మీద కన్ను వేశాడు. తరువాత విమల్ తల్లి రంజితను లొంగదీసుకున్న రంజిత్ కుమార్ ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు.
బెడ్ రూంలో తల్లి, ఫ్రెండ్!
కొంత కాలం క్రితం విమల్ పనిపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. విమల్ ఇంట్లో లేడని, బయటకు వెళ్లాడని తెలుసుకున్న డ్రైవర్ రంజిత్ కుమార్ అతని ఇంటికి వెళ్లాడు. తరువాత ఫ్రెండ్ తల్లి రంజితతో కలిసి బెడ్ రూంలో ఎంజాయ్ చేస్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్లిన విమల్ బెడ్ రూంలో తల్లి రంజిత, స్నేహితుడు రంజిత్ కుమార్ నగ్నంగా ఉన్న విషయం చూసి షాక్ కు గురైనాడు.
తల్లికి, ఫ్రెండ్ కు వార్నింగ్
తన స్నేహితుడితో తల్లి రంజిత అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం తెలుసుకున్న విమల్ కుమిలిపోయాడు. మీ పద్దతి మార్చుకోవాలని, లేదంటే ఇంటి పరువు పోతుందని తల్లి రంజిత, స్నేహితుడు రంజిత్ కుమార్ కు విమల్ వార్నింగ్ ఇచ్చాడు. ఎలాగో విషయం బయటపడింది, ఇక భయం ఎందుకు అంటూ తల్లి రంజిత, ప్రియుడు రంజిత్ కుమార్ ఇంకా బరితెగించిపోయారు.
నీ తల్లి ఏం చేస్తుందో నీకు తెలుసా?
మలయంబాక్కంలోనే నివాసం ఉంటున్న కొందరు స్నేహితులు విమల్ తల్లి రంజిత, రంజిత్ కుమార్ తో అక్రమ సంబంధం సాగిస్తుందని తెలుసుకున్నారు. విమల్ లేని సమయం చూసి రంజిత్ కుమార్ అతని ఇంటికి వెళ్లి రంజితతో రాసలీలలు సాగిస్తున్నాడు. కొంత మంది స్నేహితులు విమల్ దగ్గరకు వెళ్లి నీ తల్లి రంజిత ఏం చేస్తుందో నీకు తెలుసా ? ఇంత బరితెగిస్తే ఎలా ? అంటూ విమల్ ను హేళన చేసి మాట్లాడారు.
ఫ్రెండ్స్ తో కలిసి హత్యకు ప్లాన్
ఇదే విషయంపై తల్లి రంజితతో గొడవ పెట్టుకున్న విమల్ ఇల్లు విడిచి వెళ్లి పోయి కొంత కాలం స్నేహితుల ఇళ్లలో కాలం గడిపాడు. అయినా రంజిత, రంజిత్ కుమార్ మాత్రం వారి పద్దతి మార్చుకోలేదు. తల్లి రంజిత విషయంలో విసిగిపోయిన విమల్ ఎలాగైనా రంజిత్ కుమార్ ను హత్య చెయ్యాలని స్నేహితులు ప్రేమ్ (20), 17 ఏళ్ల బాలుడితో కలిసి ప్లాన్ వేశారు.
లాక్ డౌన్ లో లిక్కర్ కు డిమాండ్ ఉందని!
కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో డ్రైవర్ రంజిత్ కుమార్ ఇంటి దగ్గరే ఉన్నాడు. ఎలాగైనా లాక్ డౌన్ గడువు పూర్తి కాకముందే రంజిత్ కుమార్ ను అంతం చెయ్యాలని విమల్ స్నేహితులతో కలిసి స్కెచ్ వేశాడు. ఆదివారం రాత్రి మద్యం తెప్పించిన విమల్ చెన్నై శివార్లలోని ఇటుకల ఫ్యాక్టరీ దగ్గరకు వస్తే మద్యం సేవిద్దామని రంజిత్ కుమార్ కు మాయమాటలు చెప్పారు. లాక్ డౌన్ సందర్బంగా మద్యం (లిక్కర్) ఎక్కడా చిక్కకపోవడంతో రంజిత్ కుమార్ మందు కోసం ఆశపడి అక్కడికి వెళ్లాడు.
Recommended Video
మర్మాంగం తెగనరికి ఎత్తుకెళ్లి!
ఆ సమయంలో ఇటుకల ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లిన రంజిత్ కుమార్ కు పీకలదాక మద్యం తాగించిన విమల్, ప్రేమ్, 17 ఏళ్ల బాలుడు కలిసి కత్తితో అతన్ని నరికి చంపి మర్మాంగం కత్తిరించి ఎత్తుకెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిద కోణాల్లో దర్యాప్తు చెయ్యగా రంజిత, రంజిత్ కుమార్ అక్రమ సంబంధం విషయం బయటపడింది. విమల్, ప్రేమ్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. విమల్, ప్రేమ్ ను పుళల్ జైలుకు తరలించామని, 17 ఏళ్ల బాలుడిని జువైనల్ హోంకు తరలించామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.