lockdown: బీహర్లో లాక్ డౌన్, 16 నుంచి 31 వరకు, అత్యవసర సేవలు మినహాయింపు..
కరోనా వైరస్ కేసులు పెరగడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పడుతున్నాయి. పుణేలో లాక్ డౌన్ విధించగా.. యూపీ కూడా అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి బెంగళూరులో కూడా లాక్ డౌన్ అమల్లోకి రానుంది. అయితే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున బీహర్ కూడా లాక్ డౌన్ విధిస్తామని చెబుతోంది. దానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తోంది. కానీ మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువగా రెండువారాల పాటు లాక్ డౌన్ విధిస్తామని స్పష్టంచేశారు.
Recommended Video
కరోనా: కొత్త కేసుల్లో 2వ స్థానం, రికవరీలో 3, మొత్తం మరణాల్లో 8.. దేశంలో కరోనా వైరస్ లెక్కలివే..
ఈ నెల 16వ తేదీ గురువారం నుంచి బీహర్లో లాక్ డౌన్ విధిస్తారు. ఈ నెల చివరి నాటికి అంటే జూలై 31వ తేదీ శుక్రవారం వరకు అమల్లో ఉంటుంది. కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో బీహర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే లాక్ డౌన్కి సంబంధించి విధి విధానాలపై కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని బీహర్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ తెలిపారు.
అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని సంస్థలు/సముదాయాలు విధిగా మూసివేయాల్సిందేనని స్పష్టంచేసింది. లాక్ డౌన్ సందర్భంగా మార్కెట్లు, కార్యాలయాలు మూసివేస్తారు. కానీ అత్యవసర సేవలు పాలు, కూరగాయాలు, మెడికల్ షాపు, బియ్యం దుకాణాలు మాత్రం తెరిచే ఉంటాయి.