నామినేషన్ వేసిన ప్రముఖ నటి సుమలత, కాంగ్రెస్ కు ఝలక్, వేల సంఖ్యలో ఫ్యాన్స్, రోడ్ షో!
బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, బహుబాష నటి సుమలత బుధవారం (మార్చి 20వ తేది) నామినేష్ వేశారు. మండ్యలోని జిల్లాధి కార్యాలయంలో సుమలత స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేష్ వేశారు.
సుమలత నామినేష్ వేస్తున్న సందర్బంగా మండ్య జిల్లాధికారి కార్యాలయం ముందు వేల సంఖ్యలో అంబరీష్ అభిమానులు గుమికూడారు. నామిషన్ వేసిన సుమలతకు అహిందా నాయకులు మద్దతు తెలిపారు. సుమలత నామినేష్ వేస్తున్న సందర్బంగా అభిమానులు అంబరీష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
సుమలత నామినేషన్ వెయ్యక ముందు మైసూరు సమీపంలోని శ్రీ చాముండేశ్వేరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ చాముండేశ్వరి ఆలయం నుంచి నేరుగా మండ్య తాలుకాలోని ఇండువాళిలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సచ్చిదానంద ఇంటికి చేరుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
మాండ్య నుంచి పోటీ చేస్తున్నా, చిరంజీవి ప్రశంసించారు: కాంగ్రెస్కు సుమలత షాక్
కాంగ్రెస్ పార్టీ నాయకుడు సచ్చిదానంద ఇంటికి సుమలత చేరుకున్న సమయంలోనే కేజీఎఫ్ హీరో యష్ అక్కడికి చేరుకున్నారు. అనంతరం మండ్య జిల్లాధికారి కార్యాలయం చేరుకున్న సుమలత మూడు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.
సుమలత సమర్పించిన ప్రతి నామినేషన్ పత్రాల్లో 10 మంది అహిందా నాయకులు సంతకాలు చేశారు. సుమలత వెంట హీరో యష్, ఆమె కుమారుడు అభిషేక్, ప్రముఖ నిర్మాత, నటుడు రాక్ లైన్ వెంకటేష్, నటుడు దోడ్డన్న, అంబరీష్ సోదరుడు మదుసూధన్, ప్రముఖ కన్నడ దర్శకుడు నాగశేఖర్ తో పాటు అనేక మంది సుమలత వెంట ఉన్నారు నామినేషన్ వేసిన తరువాత మండ్యలోని జుబ్లీ పార్క్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అంబరీష్ అభిమానులను ఉద్దేశించి సుమలత ప్రసంగించారు.