వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత్యక్రియలకు కారులో బయలుదేరారు: మార్గం మధ్యలో లారీ ఢీకొని నలుగురి దుర్మరణం !

బంధువు అంత్యక్రియలకు కారులో బయలుదేరారుమార్గం మధ్యలో ఎదురుగా వేగంగా వచ్చి కారును ఢీకొన్న లారీనలుగురి దుర్మరణం, ఇద్దరు చిన్నారులతో సహ ఐదు మందికి తీవ్రగాయాలు

|
Google Oneindia TeluguNews

బళ్లారి: బంధువు అంత్యక్రియలకు హాజరుకావడానికి వెలుతున్న వారి కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెంది ఐదు మందికి తీవ్రగాయాలైన ఘటన కర్ణాటకలోని హోసపేట తాలుకా పాపినాయకనహళ్ళి గ్రామం సమీపంలో జరిగింది.

చిత్రదుర్గ జిల్లా హిరయూరులో నివాసం ఉంటున్న శ్రీనివాస్ (46), వెంకటమ్మ (45), నళిని (30), మరో వ్యక్తి దుర్మరణం చెందారు. ఇద్దరు పిల్లలతో సహ ఐదు మందికి తీవ్రగాయాలు కావడంతో కోప్పళలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స చేయిస్తున్నారు.

Lorry collision A car four spot death near Bellary in Karnataka

శ్రీనివాస్ దగ్గర బంధువులు హోసపేటలో నివాసం ఉంటున్నారు. హోసపేటలోని బంధువు చనిపోవడంతో శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం కారులో అంత్యక్రియలకు హాజరుకావడానికి బయలుదేరారు. మార్గం మధ్యలో జాతీయరహదారి 14లో పాపినాయకనహళ్ళి గ్రామం దగ్గర ఎదురుగా వచ్చిన లారీ కారును ఢీకొనింది. ఈ ప్రమాదంలో నలుగురు సంఘటనా స్థలంలోనే మరణించారని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారైనాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
Four people were killed and 5 people injured after lorry and car collisiona near Papinayaknahali, hospet taluk bellary district on October 21
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X