వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు, అక్రమ సంబంధం, రేప్ చేసి చంపేశారు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు వచ్చాడు. అక్రమ సంబంధం కారణంగా వివాహిత మహిళను రేప్ చేసి దారుణ చంపేసిన సంఘటన తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో జరిగింది. వివాహం అయ్యి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మహిళను హత్య చేసిన నిందితులు రోడ్డు పక్కన ఉన్న నీటి గుంతలో విసిరివేసి పరారైనారు. మహిళ హత్య కేసులో ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కుమారుడి పుట్టిన రోజు ముందురోజు ఆ బ్యూటీ పార్లల్ మహిళ హత్యకు గురైయ్యింది.

రౌడీషీటర్ తో అక్రమ సంబంధం, భర్త ముందే జల్సాలు, బాహుబలి స్టైల్లో చంపించింది !రౌడీషీటర్ తో అక్రమ సంబంధం, భర్త ముందే జల్సాలు, బాహుబలి స్టైల్లో చంపించింది !

భర్త, పిల్లలు

భర్త, పిల్లలు

నమ్మక్కల్ జిల్లాలో శోభా, సెంథిల్ దంపతులు నివాసం ఉంటున్నారు. శోభన, సెంథిల్ దంపతులకు దేవా (11), సచిన్ (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శోభన బ్యూటీ పార్లల్ నిర్వహిస్తోంది. సెంథిల్ ఆయన భార్య శోభన, కుమారులు ఇద్దరిని సంతోషంగా చూసుకుంటున్నాడు.

మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు

మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు

శోభాన బ్యూటీ పార్లల్ నిర్వహిస్తోంది. భర్త సెంథిల్ కు తాను బ్యూటీ పార్లలల్ కు వెలుతున్నానని క్రమం తప్పకుండా శోభన సమాచారం ఇచ్చేది. అదే సమయంలో శోభనకు తిరుచెంగోడ్ ప్రాంతానికి చెందిన సురేష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. శోభన, సురేష్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది.

కొడుకు బర్త్ డే

కొడుకు బర్త్ డే

రెండు రోజుల క్రితం కొడుకు దేవా పుట్టిన రోజుకు కొత్త దుస్తులు, చాక్లెట్ లు తీసుకురావడానికి వెలుతున్నానని శోభన భర్త సెంథిల్ కు చెప్పింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన శోభన తరువాత ఎంతసేపు అయినా ఇంటికి తిరిగి రాలేదు.

రాత్రి భర్తకు ఫోన్

రాత్రి భర్తకు ఫోన్

శోభన ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోజు రాత్రి 9 గంటలకు భర్త సెంథిల్ కు ఫోన్ చేసింది. రాత్రి చివరి బస్ తప్పిపోయిందని, తెలిసిన ఫ్రెండ్ కారులో ఇంటికి వస్తున్నానని సమాచారం ఇచ్చింది. అర్దరాత్రి దాటిన తరువాత శోభన ఇటికి రాకపోవడంతో అనుమానంతో సెంథిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రోడ్డు పక్కన మృతదేహం

రోడ్డు పక్కన మృతదేహం

శోభన కనపడటం లేదని కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలించారు. నమ్మక్కల్ కు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న నీటి గుంతో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. నీటి గుంతలో చిక్కిన మహిళ మృతదేహం శోభనాదే అని పోలీసులు నిర్దారించారు.

అత్యాచారం, హత్య

అత్యాచారం, హత్య

శోభన శరీరం మీద గాయాలు అయ్యాయి, శోభన వేసుకున్న దుస్తులు పూర్తిగా చినిగిపోయాయి. శోభన మీద అత్యాచారం చేసి తరువాత దారుణంగా హత్య చేశారని పోలీసులు అంటున్నారు. కుమారుడు దేవా కోసం తీసుకున్న కొత్త బట్టలు, చాక్లెట్ లు శోభన మృతదేహం పక్కనే పడిఉండటంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నగదు, నగల కోసం శోభన హత్యకు గురి కాలేదని పోలీసులు గుర్తించారు. శోభన వేసుకున్న నగలు అలాగే ఉన్నాయి.

ప్రియుడికి చివరి ఫోన్ కాల్

ప్రియుడికి చివరి ఫోన్ కాల్

శోభన మొబైల్ నెంబర్ ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. శోభన ఇంటి నుంచ వెళ్లిన తరువాత రాత్రి 9 గంటలకు భర్త సెంథిల్ కు ఫోన్ చేసిందని, అదే రోజు చివరిసారిగా ప్రియుడు సురేష్ కు ఫోన్ కాల్ చేసిందని పోలీసులు గుర్తించారు. సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అయితే శోభనను తాను హత్య చెయ్యలేదని, అక్రమ సంబంధం మాత్రమే ఉందని సురేష్ తప్పుడు సమాచారం ఇస్తున్నాడని పోలీసులు అంటున్నారు. సురేష్ తో పాటు మరెవరైనా శోభన మీద అత్యాచారం చేశారా ? ఎదురు తిరిగిన ఆమెను తరువాత హత్య చేశారా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
Tamil Nadu: Beauty parlour woman murdered due to illegal love affair and young man confessed to namakkal police about it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X