lockdown lover: కాలేజ్ లవర్స్, లాక్ డౌన్ లో ప్రియురాలు రివర్స్, పొడిచి చంపిన ప్రియుడు, తండ్రికి!
కోయంబత్తూరు/ చెన్నై: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు కాలేజ్ కు వెలుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. తరువాత ఇద్దరు కులాలు వేరు అని బయటపడింది. వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని అమ్మాయి తల్లిదండ్రులు బెదిరించారు. రానురాను ప్రియుడికి ప్రియురాలు దూరం అయ్యింది.
Recommended Video
ప్రియురాలు దూరం అయ్యిందని జీర్ణించుకోలేని ప్రియుడు లాక్ డౌన్ సమయంలోనే ఆమె ఇంటికి చేరుకున్నాడు. ప్రేమికుల మద్య మాటామాటా పెరిగిపోయింది. సహనం కోల్పోయిన ప్రియుడు కత్తి తీసుకుని ప్రియురాలిని, అడ్డు వచ్చిన ఆమె తండ్రిని ఇష్టం వచ్చినట్లు పొడిచాడు. ప్రియుడి చేతిలో ప్రియురాలు అంతం అయ్యింది.
Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!
ఒకే ప్రాంతంలో నివాసం
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా (కోవై)లోని పెరూరు అరుమురుగా కౌంటనూరు ప్రాంతంలో చంద్రన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చంద్రన్ కుమారుడు రితేష్ (22). ఇదే పట్టణంలో శక్తివేల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శక్తివేల్ కుమార్తె ఐశ్వర్య (18). రితేష్, ఐశ్వర్య కాలేజ్ కు వెళ్లి చదువుకుంటున్నారు. ఇదే సమయంలో ఒకే ప్రాంతానికి చెందిన రితేష్, ఐశ్వర్య చనువుగా దగ్గర అయ్యారు.
లాక్ డౌన్ లో ప్రేమికులు
రితేష్, ఐశ్వర్య ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుని మురిసిపోయారు. కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో కాలేజ్ మూసివేశారు. ఐశ్వర్య, రితేష్ ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రియురాలు ఐశ్వర్యను చూడటానికి రితేష్ అనేక ప్రయత్నాలు చేసినా లాక్ డౌన్ కారణంగా ఆమెను కలవడం మాత్రం వీలుకాలేదు.
ఆత్మహత్య చేసుకుంటాం... జాగ్రత్త
ప్రియుడు రితేష్ ప్రియురాలు ఐశ్వర్య ఇంటి చుట్టూ తిరగడంతో ఆమె తండ్రి శక్తివేల్ కు అనుమానం వచ్చింది. ఇంట్లో ఐశ్వర్యను నిలదీయడంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది. ఇద్దరు కులాలు వేరు, నువ్వు ప్రేమ పెళ్లి అంటూ డ్రామాలు వేస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామని ఐశ్వర్యను ఆమె తల్లిదండ్రులు హెచ్చరించారు.
చేతులు ఎత్తేసిన ప్రియురాలు
తల్లిదండ్రుల మాట విన్న ఐశ్వర్య రానురాను ప్రియుడు రితేష్ కు దూరం అవుతూ వచ్చింది. గత రెండు నెలల నుంచి ప్రియుడు రితేష్ ప్రియురాలు ఐశ్వర్యకు ఫోన్ చేసి నువ్వు ఇంట్లో నుంచి వచ్చేయ్, పెళ్లి చేసుకుని వేరుగా కాపురం పెడుదాం అని ఒత్తిడి చేశాడు. తరువాత ప్రియుడు రితేష్ ను ఒక్కసారికూడా కలవకుండా, అతని ఫోన్ కాల్స్ రిసీవ్ చెయ్యకుండా ఐశ్వర్య తండ్రి శక్తివేల్ మాటలను దవజాటకుండా మొండికివేసింది. ఈ దెబ్బతో ప్రియుడు రితేష్ ఎలాగైనా ప్రియురాలు ఐశ్వర్యను కలవాలని నిర్ణయించుకుని నేరుగా ఆమె ఇంటికే వెళ్లిపోయాడు.
నాతో తిరిగినప్పుడు కులం గుర్తుకు రాలేదా?
ఐశ్వర్య ఇంటికి వెళ్లిన రితేష్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. నేను నిన్ను ప్రేమించిన టైమ్ లో నీ కులం, గోత్రం గురించి ఆలోచించలేదని, ఇప్పుడు ఎందుకు మొండికి వేస్తున్నావని, వెంటనే నాతో వచ్చేయాలని గొడవ చేశాడు. ఆ సమయంలో ఐశ్వర్య, రితేష్ ల మధ్య మాటామాటా పెరిగిపోయి పెద్ద గొడవ జరిగింది. అదే సమయంలో బయటనుంచి ఇంట్లోకి వెళ్లిన ఐశ్వర్య తండ్రి శక్తివేల్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని రితేష్ కు వార్నింగ్ ఇచ్చాడు.
ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేశాడు
గొడవ పెద్దదికావడంతో సహనం కోల్పోయిన రితేష్ వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని ప్రియురాలు ఐశ్వర్య మీద నాలుగుసార్లు పొడిచాడు. ఆ టైమ్ లో షాక్ కు గురైన శక్తివేల్ కుమార్తె ఐశ్వర్యను పొడవకుండా రితేష్ ను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో అతన్ని పొడిచాడు. ఐశ్వర్య, శక్తివేల్ కు కత్తిపోట్లు పడటంతో తండ్రి కూతురు గట్టిగా కేకలు వేశారు. స్థానికులకు చిక్కిపోతామని భయపడిన రితేష్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. ఐశ్వర్య, శక్తివేల్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఐశ్వర్య మరణించింది. శక్తివేల్ మృత్యువుతో పోరాడుతున్నాడని, ప్రియురాలిని హత్య చేసి పరారైన రితేష్ కోసం గాలిస్తున్నామని సోమవారం పోలీసులు చెప్పారు.