లవ్ మ్యారేజ్, మధ్యలో కాలేజ్ అమ్మాయి ఎంట్రీ, అక్రమ సంబంధం, ఏదో ప్లాన్, నిజంగానే చచ్చిపోయారు !
చెన్నై/ తిరుచ్చి: అక్రమ సంబంధం విషయం ఇంటిలో తెలిసిపోయిందని భార్య, కుమారుడిని గాలికి వదిలేసి ప్రియురాలితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతి వివాహం అయిన వ్యక్తితో అక్రమ సంబంధం సాగించి అతనితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. అక్రమ సంబంధం కారణంగా ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అక్రమ సంబంధం సాగిస్తున్న ప్రేమికులు ఏదో ప్లాన్ వేసుకున్నారు. అయితే వారు నిజంగానే చచ్చిపోయారు. పోలీసులు అనేక కోణాల్లో ప్రేమికుల ఆత్మహత్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ ఫోటోలు విడుదల, వేట, వీడియోలతో చిత్రహింసలు!
ప్రేమ వివాహం
తమిళనాడులోని తిరుచ్చిలోని పుత్తూర్ లోని విషంకుళం ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజా కుమారుడు రమేష్ (31), తెన్నూరు ఇలాంతోప్పు ప్రాంతానికి చెందిన కావ్య (25) మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. రమేష్, కావ్య ప్రేమ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారి పెళ్లికి నిరాకరించారు. పెద్దలను ఎదిరించిన రమేష్, కావ్య 2019 మార్చిలో వివాహం చేసుకున్నారు. రమేష్, కావ్య దంపతకులకు 7 నెలల కుమారుడు ఉన్నాడు.
కాలేజ్ అమ్మాయి ఎంట్రీ
తిరుచ్చిలోని తెన్నూర్ సంగీతపురానికి చెందిన ఆంథోని కుమార్తె రీనా (19) పుత్తూరులోని ప్రైవేట్ కాలేజ్ లో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. రమేష్ సొంతంగా కారు తీసుకుని దానిని నడుపుకుంటా భార్య కావ్య, కుమారుడిని పోషిస్తున్నాడు.
లవ్, అక్రమ సంబంధం !
రమేష్ కారులో కాలేజ్ కు వెలుతున్న రీనా అతనితో పరిచయం పెంచుకుంది. రమేష్, రీనాల పరిచయం ప్రేమకు దారి తీసింది. రమేష్, రీనా అక్రమ సంబంధం సాగించారు. రమేష్ కు వివాహం అయ్యిందని, కుమారుడు ఉన్నాడని తెలిసినా రీనా మాత్రం అతని మాయలో పడిపోయింది.
హెచ్చరించిన భార్య, ఫ్యామిలీ
రమేష్, రీనా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ తిరగడం, ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కావ్య భర్త రమేష్ ను నిలదీసింది. ప్రేమించి పెద్దలను ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ కావ్య విలపించింది. రీనా వ్యవహారం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు సైతం రమేష్ ను హెచ్చరించారు.
విడిపోయి జీవించలేక, బెదిరించాలని !
రమేష్, రీనా ఒకరిని విడిచి ఒకరు ఉండేకపోయారు. ఇరు కుటుంబ సభ్యులు హెచ్చరించినా రమేష్, రీనా పద్దతి మాత్రం మార్చుకోలేదు. ఎలాగైనా కుటుంబ సభ్యులను బెదిరించాలని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబ సభ్యులను బెదిరించాలని రమేష్, రీనా ప్లాన్ వేశారు. అయితే రమేష్, రీనాల బెదిరింపులను వారి కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు.
నిజంగానే ఆత్మహత్య
తిరుచ్చి పుత్తరసనల్లూరు సమీపంలోని కావేరీ నది తీరానికి సాయంత్రం రమేష్, రీనా కారులో వెళ్లారు. అక్కడే ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటున్న విషయం కావేరీ నదిలో స్నానం చెయ్యడానికి వెళ్లిన వారు చూశారు. తరువాత రమేష్, రీనా వెంట తీసుకెళ్లిన విషం బాటిల్ తీసుకుని దానిని తాగేసి కావేరీ నదిలో స్నానం చెయ్యడానికి వెళ్లారు. విషయం శరీరం మొత్తం వ్యాపించడంతో రమేష్, రీనా నదీ తీరంలోకి చేరుకుని విలవిలలాడారు. ఆ సమయంలో అక్కడే స్నానం చేస్తున్న వారు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూసే సమయానికి రమేష్, రీనా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
కారులో మొబైల్ ఫోన్లు !
కావేరీ నది సమీపంలోని రమేష్ కారులో పోలీసులు పరిశీలించి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ లోని నెంబర్ల ఆధారంగా వారి అడ్రస్ లు తెలుసుకున్న పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో రమేష్, రీనా సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ప్రేమ, అక్రమ సంబంధం కారణంగానే రమేష్, రీనా ఆత్మహత్య చేసుకున్నారా ? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.